జేసీ సంచలన వ్యాఖ్యలు.. మా బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటాం
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వైసీపీ నేతలకు వంగి వంగి దండాలు పెడుతున్నారన్న ఆయన.. తాము అధికారంలోకి వచ్చాక, తమ బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు జేబుల్లో గంజాయి పెట్టించి గంజాయి కేసుల్లో ఇరికిస్తా అంటూ జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాము అధికారంలోకి వస్తామన్న.. అప్పుడు మీ అంతు చూస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబును […]
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వైసీపీ నేతలకు వంగి వంగి దండాలు పెడుతున్నారన్న ఆయన.. తాము అధికారంలోకి వచ్చాక, తమ బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు జేబుల్లో గంజాయి పెట్టించి గంజాయి కేసుల్లో ఇరికిస్తా అంటూ జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాము అధికారంలోకి వస్తామన్న.. అప్పుడు మీ అంతు చూస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి కూడా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు సాధుజంతువులా ఉండకూడదు. పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మందికి టికెట్లు ఇవ్వొద్దని ఆయనకు సూచించా. అయినా చంద్రబాబు నా మాటలు వినలేదు’’ అంటూ జేసీ కామెంట్లు చేశారు.
జగన్ మరో రాజారెడ్డి: ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జేసీ వ్యాఖ్యలు చేశారు. జగన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అని అన్న ఆయన.. వైఎస్లో ఉన్న మంచి లక్షణాలు జగన్లో 10శాతం కూడా లేవని అన్నారు. జగన్ మరో రాజారెడ్డి అంటూ జేసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జేసీకి కొత్తేం కాదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన వ్యాఖ్యలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఆయన ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో, ఎవరిని ప్రశంసిస్తారో ఎవ్వరికీ అర్థం కాదు. మరోవైపు జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జేసీ ఫ్యామిలీకి గడ్డు కాలం నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయంటూ జేసీ ఫ్యామిలీకి సంబంధించిన పలు బస్లను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. మరోవైపు నియోజకవర్గంలో జేసీ ఫ్యామిలీ ప్రత్యర్థి కేతిరెడ్డి హవా నడుస్తుండటంతో రాజకీయంగానూ జేసీ ఫ్యామిలీ కాస్త బలహీనపడిన విషయం తెలిసిందే.