జేసీ గారూ! జగన్‌కి జై కొడుతున్నారా?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చేసినా కూడా ఓటు అడిగితే ప్రజలు డబ్బు అడుగుతున్నారంటూ మెన్నీమధ్య వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.ఆ తర్వాత జగన్ గెలిస్తే మొదట జైల్లో వేసేది నన్నే అన్న ఆయన…ఏపీలో ఇటీవలి  అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 99శాతం మంది రెడ్డి సామాజికవర్గం వారు వైసీపీకే ఓటు వేశారని అంచనా వేశారు. అయినా సరే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని […]

జేసీ గారూ! జగన్‌కి జై కొడుతున్నారా?
Follow us

|

Updated on: Apr 29, 2019 | 12:14 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చేసినా కూడా ఓటు అడిగితే ప్రజలు డబ్బు అడుగుతున్నారంటూ మెన్నీమధ్య వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.ఆ తర్వాత జగన్ గెలిస్తే మొదట జైల్లో వేసేది నన్నే అన్న ఆయన…ఏపీలో ఇటీవలి  అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 99శాతం మంది రెడ్డి సామాజికవర్గం వారు వైసీపీకే ఓటు వేశారని అంచనా వేశారు. అయినా సరే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని అదే సమయంలో…బాబు పట్ల తన స్వామి భక్తిని చాటుకున్నారు. తనకు కూడా కులాభిమానం ఉందని, ఈసారి ఎన్నికలు పూర్తిగా కులం పేరు మీదే జరిగాయని చెప్పారు. జగన్ కంటే చంద్రబాబు రైతులకు మేలు చేస్తున్నారన్న కారణంతోనే తాను మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు.రాష్ట్రంలో ఒకవేళ టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తే మాత్రం అది పసుపు కుంకుమ పథకం చలవేనని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

ఏప్రిల్ 11న ఎన్నికలు జరగ్గా, అందుకు కరెక్టుగా ఐదు రోజుల ముందు పసుపు కుంకుమ చెక్కులు మహిళలకు అందాయని, అవే పనిచేశాయన్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబునాయుడు 120 పథకాలు ప్రవేశ పెట్టినా, అవేవీ పనిచేయలేదని, చివరి నిమిషంలో తీసుకొచ్చిన పసుపు కుంకుమ పథకం మాత్రమే పనిచేసిందని అంచనా వేశారు. ఒకవేళ ఎన్నికలు మరో వారం రోజులు ఆలస్యం అయి ఉంటే, టీడీపీ పని అయిపోయేదన్నారు.