‘మహానటి’ మీకు నేను ఫిదా అయ్యా: జాన్వీ కపూర్

సినీ నటి కీర్తి సురేశ్‌కు తాను ఫిదా అయిపోయానని బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చెప్పింది. బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవగన్ సరసన కీర్తి సురేశ్ ఓ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా మహానటి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా.. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ గురించి ఓ పోస్ట్ చేసింది జాన్వీ. ‘‘మహానటిని చూసినప్పటి నుంచి నేను మీకు ఫిదా అయ్యా. మా […]

‘మహానటి’ మీకు నేను ఫిదా అయ్యా: జాన్వీ కపూర్
Follow us

| Edited By:

Updated on: Mar 15, 2019 | 7:05 AM

సినీ నటి కీర్తి సురేశ్‌కు తాను ఫిదా అయిపోయానని బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చెప్పింది. బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవగన్ సరసన కీర్తి సురేశ్ ఓ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా మహానటి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా.. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ గురించి ఓ పోస్ట్ చేసింది జాన్వీ. ‘‘మహానటిని చూసినప్పటి నుంచి నేను మీకు ఫిదా అయ్యా. మా నాన్న తదుపరి చిత్రంలో మీరు భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. స్వాగతం’’ అంటూ పోస్ట్ చేసింది జాన్వీ. ఈ సందర్భంగా కీర్తి సురేశ్ ఫొటోను షేర్ చేసింది. దానికి స్పందించిన కీర్తి.. ‘‘థ్యాంక్యు సో మచ్ జాన్వీ. నీ లాగే నేను చాలా ఆసక్తితో ఉన్నా’’ అంటూ సమాధానం ఇచ్చింది. కాగా అమిత్ శర్మ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని బోని కపూర్ నిర్మిస్తున్నారు. ఇండియన్ ఫుట్‌బాల్ మాజీ కోచ్ సయ్యద్ అహ్మద్ రహీమ్ బయోపిక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.