‘గుంజన్ సక్సేనా’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జాన్వీ.. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలనేదే తన కొరికంటూ..
అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది బాలీవుడ్ తార జాన్వీకపూర్. పేరుకు శ్రీదేవి నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుందీ చిన్నది. తొలి సినిమాతోనే బడా చిత్రంలో నటించే అవకాశం ఉన్నా...
Janhvi about gunjan saxena movie: అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది బాలీవుడ్ తార జాన్వీకపూర్. పేరుకు శ్రీదేవి నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుందీ చిన్నది. తొలి సినిమాతోనే బడా చిత్రంలో నటించే అవకాశం ఉన్నా నటనకు ప్రాధాన్యత ఉన్న ధడక్ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో తనదైన నటనతో ఆకట్టుకుందీ అమ్మడు. ఇదిలా ఉంటే జాన్వీ తాజాగా భారత వైమానిక దళ పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రంతో జాన్వీ నటిగా మరో మెట్టు పైకెక్కిందని చెప్పాలి. ఇక తాజాగా ఓ ఇంర్వ్యూలో పాల్గొన్న జాన్వీ ఈ సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఈ అందాల తార మాట్లాడుతూ.. హీరోయిన్గా ఈ సినిమా నన్ను నేను మరింత అర్థం చేసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపింది. ఈ సినిమా నాలో ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసిందని చెప్పుకొచ్చింది. దీనికి కారణం గుంజన్ మేడమ్ కథ ప్రభావమే అయ్యుంటదని జాన్వీ అభిప్రాయపడింది. జీవిత ప్రయాణంలో ముందుకు వెళ్లేందుకు ఎన్నో విషయాలను ఈ చిత్రం ద్వారా నేర్చుకున్నానని తెలిపింది. ఇక భవిష్యత్తులో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలనేదే తన కోరిక అని.. అవి వ్యక్తుల జీవితాలను కదిలించే విధంగా ఉండాలని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. జాన్వీ ప్రస్తుతం రూహీ అఫ్జానా, దోస్తానా2 చిత్రాల్లో నటిస్తోంది.