ఏపీ లోకల్ ‘పంచాయితీ’: ఎస్ఈసీ, జడ్జిలకు కులం అంటగట్టవద్దు… స్థానిక సంస్థల ఎన్నికలు జరిపాలన్న పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ తీరు పట్ల పవన్ కళ్యాణ్ అసహానం వ్యక్తం చేశారు. లోకల్ బాడీ ఎన్నికలకు కరోనాను సాకుగా చూపడం సరికాదన్నారు.
Pawan Kalyan Prakasam tour : ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ తీరు పట్ల ఆయన అసహానం వ్యక్తం చేశారు. లోకల్ బాడీ ఎన్నికలకు కరోనాను సాకుగా చూపడం సరికాదన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో శ్రీకాళహస్తీలో వైసీపీ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యానికి తొలి మెట్టు అయిన పంచాయితీ ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేసిన పవన్.. ఉద్యోగ సంఘాలు కరోనా వ్యాక్సిన్ తీసుకుని ఎన్నికల్లో పాల్లొనాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు వాస్తవ పరిస్థితులును అర్దం చేసుకుని ఎన్నికలు జరపాలన్నారు. అలాగే. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ, న్యాయమూర్తులకు కులం అపాదించడం సరికాదన్నారు.
మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో ఈడబ్యూఎస్ ద్వారా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ప్రశంసనీయమన్నారు. సీఎం కేసీఆర్కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.