రాజధాని రగడలోకి పవన్‌కల్యాణ్.. 30న ఏం చేయబోతున్నారంటే?

ఏపీవ్యాప్తంగా రాజధాని అంశం సెగలు రేపుతోంది. మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చిన నుంచి గత 9 రోజులుగా అమరావతి ఏరియా ప్రజలు, రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే వున్నారు. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటన తర్వాత స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ తర్వాత కనిపించలేదు. ఆయన తన కుటుంబంతో వెకేషన్‌కు వెళ్ళారని ప్రచారం జరిగింది. తాజాగా వేకేషన్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన జనసేనాని.. బాక్సింగ్ డే నాడు రంగంలోకి దిగారు. జనసేన పార్టీలోని ముఖ్యమైన […]

రాజధాని రగడలోకి పవన్‌కల్యాణ్.. 30న ఏం చేయబోతున్నారంటే?
Follow us

| Edited By:

Updated on: Dec 26, 2019 | 10:48 PM

ఏపీవ్యాప్తంగా రాజధాని అంశం సెగలు రేపుతోంది. మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చిన నుంచి గత 9 రోజులుగా అమరావతి ఏరియా ప్రజలు, రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే వున్నారు. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటన తర్వాత స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ తర్వాత కనిపించలేదు.

ఆయన తన కుటుంబంతో వెకేషన్‌కు వెళ్ళారని ప్రచారం జరిగింది. తాజాగా వేకేషన్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన జనసేనాని.. బాక్సింగ్ డే నాడు రంగంలోకి దిగారు. జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని గురువారం పార్టీ సీనియర్ల భేటీలో నిర్ణయించారు.

ఈ నెల 30వ తేదీన పవన్ కళ్యాణ్ అధ్యకతన సమావేశం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ముఖ్య నేతలంతా రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ, పార్టీ వ్యూహాత్మక కమిటీ, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ, ముఖ్య నేతలు హాజరు కావాలని ఆదేశించారు జనసేనాని.

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు, అమరావతి గ్రామాల ప్రజలు, రైతుల ఆందోళన, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రత వంటి అంశాలను విస్తృత స్థాయి సమావేశానికి ఎజెండాగా ఖరారు చేశారు. జనసేన స్టాండ్, పార్టీ పరంగా నిర్వహించవలసిన కార్యక్రమాలు తదితర అంశాలపై కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు పవన్ కల్యాణ్ సిద్దమవుతున్నారు.

ఒకవైపు మూడు రాజధానుల ప్రతిపాదనను పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తుంటే.. ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి మాత్రం మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమాన స్థాయిలో అభివృద్ధి చెందేందుకు ఈ ప్రతిపాదన దోహదపడుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. దీంతో అమరావతి ఏరియా ప్రజల్లో చిరంజీవిపై చులకన ఏర్పడగా.. పవన్ కల్యాణ్ చరిష్మా పెరిగిందని పరిశీలకు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా 30వ తేదీన జనసేన పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు