జనసేనాని “రైతు సౌభాగ్య దీక్ష” ప్రారంభం
రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. జనసేన అధనేత పవన్ కల్యాణ్.. ఒక్కరోజు నిరాహార దీక్ష ప్రారంభించారు. కాకినాడ జేఎన్డీయూ ఎదురుగా “రైతు సౌభాగ్య దీక్ష” పేరుతో దీక్షకు దిగారు. దీక్షాస్థలికి చేరుకోగానే.. జనసేనానికి పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు రైతన్నలు. మహిళలు, రైతన్నలు పవన్ కల్యాణ్కు హారతి ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఈ దీక్ష దిగారు జనసేనాని. ముఖ్యంగా రైతు భరోసా అమలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల […]
రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. జనసేన అధనేత పవన్ కల్యాణ్.. ఒక్కరోజు నిరాహార దీక్ష ప్రారంభించారు. కాకినాడ జేఎన్డీయూ ఎదురుగా “రైతు సౌభాగ్య దీక్ష” పేరుతో దీక్షకు దిగారు. దీక్షాస్థలికి చేరుకోగానే.. జనసేనానికి పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు రైతన్నలు. మహిళలు, రైతన్నలు పవన్ కల్యాణ్కు హారతి ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఈ దీక్ష దిగారు జనసేనాని. ముఖ్యంగా రైతు భరోసా అమలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలపై , గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సాయంత్రం 6.00 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. ఈ సందర్భంగా రైతుల నుంచి వినతులను స్వీకరించనున్నారు. జనసేనాని దీక్షకు మద్దతుగా పెద్ద ఎత్తున జనసైనికులు దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. అంతేకాదు పవన్ వెంట.. నాగబాబు కూడా ఉన్నారు.