ఏపీకి అమరావతే శాశ్వత రాజధాని: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతేనని జనసేనాని పవన్ మరోసారి స్పష్టం చేశారు. రిపబ్లిక్ డే వేడుకలను మొదట విశాఖపట్నంలో నిర్వాహించాలనుకున్న ప్రభుత్వం..తిరిగి వెనక్కి తగ్గి విజయవాడకు మార్చాలనుకున్నారని గుర్తు చేశారు. అమరావతి విషయంలో కూడా ప్రభుత్వ ధోరణి అదే అని ఆయన స్పష్టం చేశారు. రాజధానిని షిప్ట్ చెయ్యడం అంత ఈజీ విషయం కాదన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్స్ మాత్రమే మారుతున్నాయని, వాటి పనితీరు […]
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతేనని జనసేనాని పవన్ మరోసారి స్పష్టం చేశారు. రిపబ్లిక్ డే వేడుకలను మొదట విశాఖపట్నంలో నిర్వాహించాలనుకున్న ప్రభుత్వం..తిరిగి వెనక్కి తగ్గి విజయవాడకు మార్చాలనుకున్నారని గుర్తు చేశారు. అమరావతి విషయంలో కూడా ప్రభుత్వ ధోరణి అదే అని ఆయన స్పష్టం చేశారు. రాజధానిని షిప్ట్ చెయ్యడం అంత ఈజీ విషయం కాదన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్స్ మాత్రమే మారుతున్నాయని, వాటి పనితీరు మాత్రం మారడం లేదని ఆక్షేపించారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక నిధులు వస్తున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం వాటిని సరిగ్గా వినియోగించడం లేదని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సమ్మతితోనే రాజధానిని మారుస్తున్నట్టు వైసీపీ చెప్తోందని, మూడు రాజధానుల విషయంలో సెంట్రల్ గవర్నమెంట్కు అస్సలు సంబంధం లేదని పవన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పేరును కూడా వైసీపీ భ్రష్టు పట్టిస్తుందన్న పవన్..నిర్మలా సీతారామన్తో పలు కీలక విషయాలు చర్చించానని తెలిపారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం తన పద్దతిని మార్చుకోవకపోతే..తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అమరావతిలో మహిళలు, రైతులను తీవ్రంగా హింసించారని, కేంద్ర మంత్రుల వద్ద ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తానన్నారు. బీజేపీతో కలిసి కూలంకషంగా చర్చించి బలమైన కార్యచరణ ప్రకటిస్తానని పవన్ తెలిపారు.