యుద్ధభూమిలో ఆతిథ్యం..

కశ్మీర్‌కు వెళ్లేవారిలో టూరిస్టులే ఎక్కువ.. పర్యాటకుల నుంచి ఆదాయం వస్తుంది కాబట్టి వారికి ఉగ్రవాదులు ఎలాంటి హాని తలపెట్టరు.. కానీ నా చేతిలో మైక్, కెమెరామన్ చేతిలో కెమెరా పట్టుకుని మా ఐడెంటిటీని దాచుకుని తిరగలేం. అలా తిరిగినా ఉపయోగం ఏముంటుంది టీవీ మీడియాకు? మీడియా ప్రతినిధులుగా మమ్మల్ని చూడగానే స్థానిక కశ్మీరీల్లో ఎవరైనా ముందుగా అనే మాట “ఇండియన్ మీడియా.. XXXXX” అనే పదంతో మొదలుపెట్టి తిట్ల దండకమే. నాకు కశ్మీర్ పర్యటన మొదటిసారేమీ కాదు. […]

యుద్ధభూమిలో ఆతిథ్యం..
Follow us

|

Updated on: Feb 20, 2020 | 12:58 PM

కశ్మీర్‌కు వెళ్లేవారిలో టూరిస్టులే ఎక్కువ.. పర్యాటకుల నుంచి ఆదాయం వస్తుంది కాబట్టి వారికి ఉగ్రవాదులు ఎలాంటి హాని తలపెట్టరు.. కానీ నా చేతిలో మైక్, కెమెరామన్ చేతిలో కెమెరా పట్టుకుని మా ఐడెంటిటీని దాచుకుని తిరగలేం. అలా తిరిగినా ఉపయోగం ఏముంటుంది టీవీ మీడియాకు? మీడియా ప్రతినిధులుగా మమ్మల్ని చూడగానే స్థానిక కశ్మీరీల్లో ఎవరైనా ముందుగా అనే మాట “ఇండియన్ మీడియా.. XXXXX” అనే పదంతో మొదలుపెట్టి తిట్ల దండకమే. నాకు కశ్మీర్ పర్యటన మొదటిసారేమీ కాదు. అప్పటికే శ్రీనగర్ ఎన్.ఐ.టీలో జరిగిన గొడవ, అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై కాల్పులు, ఉరి – ఉగ్ర ఘాతుకం సహా పలు సందర్భాల్లో అక్కడ అన్ని మూలలూ తిరిగినవాడినే. అయినా సరే.. వెళ్లిన ప్రతిసారీ.. నేను ఓ పరాయి దేశంలో.. అందునా శతృదేశం పాకిస్తాన్‌లో ఉన్నానేమో అనిపించేది. ఎందుకంటే కనిపించిన ప్రతి పది మందిలో ఏడేనిమిది మంది మమ్మల్ని ఇండియన్ మీడియా, ఇండియన్ ఆర్మీ, బ్లడీ ఇండియన్స్ అంటూ వేరు చేసి మాట్లాడడమే. వాళ్ల మాటలు ఆగ్రహం తెప్పించినా సరే.. అత్యంత ఓర్పు, సహనంతో ఉండాలి. తప్పదు. అనువుగాని చోట అధికులం అంటే.. ప్రాణాలకే గ్యారంటీ లేకుండా పోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మన విధి నిర్వహణ పూర్తిచేయాలంటే లౌక్యం కూడా చాలా అవసరం. సుదీర్ఘకాలం క్రైమ్ రిపోర్టింగ్ కూడా చేసినందున, నాకు మాబ్ హిస్టీరియా గురించి కూడా బాగా అవగాహన ఉంది. ఒక గుంపులో ఏ ఒక్కరు అదుపుతప్పి దాడికి దిగినా, మిగతావాళ్లు అడ్డుకోరు సరికదా, తలా ఓ చేయి వేసి చావబాదుతారు. ఈ అనుభవాలతోనే అక్కడ హిందీ, ఇంగ్లిష్ న్యూస్ ఛానెళ్లకు చెందిన రిపోర్టర్లు తమ మైక్ మీద లోగో లేకుండా పట్టుకుని తిరుగుతూ ఉంటారు. పైగా సెన్సిటివ్ ప్రాంతాల్లోకి రాకుండా భద్రతా బలగాల మధ్య తిరుగుతూ రిపోర్టింగ్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడి పరిస్థితిని చూపాలంటే అది మాత్రమే సరిపోదు.

అందుకే.. శ్రీనగర్ సిటీలో సెన్సిటివ్ ప్రాంతాలకు వెళ్లినప్పడు, అక్కడివారితో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు నా పరిచయంతో పాటుగా నేను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పేవాడిని. కశ్మీర్‌లో దక్షిణ భారతీయులపై, ముఖ్యంగా హైదరాబాదీలపై చాలా మందికి సాఫ్ట్ కార్నర్ ఉంది. అక్కడికి వచ్చే పర్యాటకుల్లోనూ దక్షిణాదివారు సౌమ్యంగా, హుందాగా ఉంటారని, ఎటొచ్చీ ఉత్తరాది రాష్ట్రాలవారికే ఆగ్రహావేశాలు ఎక్కువని కశ్మీరీల భావన. అంతేకాదు, ఉరి – పుల్వామా దాడుల నేపథ్యంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న కశ్మీరీ విద్యార్థులపై దాడులు జరిగాయి. వాటిలో అత్యధికంగా ఉత్తర భారతదేశంలోనే జరిగాయి. ఇది కూడా వారి మనసుపై ఒక ముద్ర వేశాయి. దానికి తోడు కశ్మీరీలు విపరీతంగా ద్వేషించే బీజేపీ – ప్రధాని నరేంద్ర మోదీలకు దక్షిణాది రాష్ట్రాల్లో ఆదరణ లేకపోవడం వల్ల కూడా కాస్తో-కూస్తో సౌతిండియన్స్ పై స్నేహభావం ఏర్పడింది. నా పని నిర్విఘ్నంగా, సురక్షితంగా చేసుకోడానికి వీలుగా ఈ ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ స్టేట్ విలీనం వరకు చరిత్రను గుర్తుచేస్తూ లౌక్యం ప్రదర్శించేవాడిని.

ఫిబ్రవరి 17న పుల్వామా ఉగ్రదాడి ప్రాంతంతో పాటు నగరంలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో తిరిగి గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేశాం. ఈ క్రమంలో ఆకలిదప్పులు మర్చిపోయాం. కానీ సాయంత్రమయ్యేసరికి మా టీమ్‌లో నీరసం ఆవహించింది. ఎక్కడైనా ఆగి తిందాం అంటే.. కర్ఫ్యూ కారణంగా సిటీ మొత్తం లాక్ డౌన్. తినడానికి ఎక్కడా తిండి దొరకని పరిస్థితి. పోనీ చేసిన కవర్ ఫుటేజి పంపిద్దాం అంటే మొబైల్ ఇంటర్నెట్ షట్ డౌన్. ఇంత కష్టపడి చేసిన కవరేజి టెలికాస్ట్ కాకపోతే ఆ బాధ ఒక జర్నలిస్టుకు వర్ణనాతీతం. కానీ ఏదో ఒక ప్రత్యామ్నాయం చూడాలి. పాత మిత్రుడు మెహరాజ్ అహ్మద్‌ను అడిగితే, సిటీలో బ్రాడ్‌బ్యాండ్ కూడా సరిగా పనిచేయడం లేదని, చాలా స్లోగా ఉందని చెప్పాడు.

పుల్వామాలో కారులో వచ్చి ఆత్మాహుతి దాడి చేసిన చోట రోడ్డు కొంత పాడవడంతో రిపేర్ వర్క్ చేయడానికి వచ్చిన కొందరు తెలుగు ఇంజనీర్లు టీవీ9 లోగో చూసి గుర్తుపట్టి మా బ్యాకప్ టీమ్‌తో అంతకంటే ముందు రోజు మాట్లాడారు. ఆ విషయం నాకు గుర్తుండడంతో వాళ్లను పట్టుకునే సహాయం దొరకవచ్చు అనుకుంటూ సిటీ వదిలి హైవే మీదకొచ్చాం. శ్రీనగర్ – జమ్ము నేషనల్ హైవే నిర్మాణంతో పాటు మెయింటనెన్స్ కాంట్రాక్ట్ పనులు రాంకీ గ్రూపు నిర్వహిస్తోందని హైవే మీద ఉన్న బోర్డుల ద్వారా అర్థమైంది. వెంటనే వాళ్ల లోకల్ క్యాంప్ ఎక్కడుందో వాకబు చేసి పుల్వామాకు సమీపంలో ఉన్న క్యాంప్ దగ్గరకు చేరుకున్నాం. మా పరిస్థితి వివరించి, మీ దగ్గర బ్రాడ్‌బ్యాండ్ ఉంటే ఇంటర్నెట్ వాడుకుంటాం అని చెప్పాం. అక్కడున్న యూనిట్ హెచ్ఆర్ హెడ్ రాజు గోరంట్ల, మరో టెక్నికల్ ఇన్‌ఛార్జి కిశోర్ సహా అక్కడున్నవారంతా ఎంతో సంతోషంగా, సాదరంగా స్వాగతించారు. ఇంటర్నెట్ ల్యాన్ వైర్ మా 4జీ కిట్‌కు కనెక్ట్ చేసి ఐపీ అడ్రస్ రూట్ చేశా. (వృత్తి జర్నలిజమే అయినా నేను చదువుకున్నది కంప్యూటర్ సైన్స్, ఐన్ఫర్మేషన్ టెక్నాలజీ కావడంతో ఆ పరిజ్ఞానం నాకుంది). అయితే ఫీడ్ పంపేంత బ్యాండ్ విడ్త్ రావడం లేదు. ఇక ఇలా లాభం లేదని, ఫుటేజి మొత్తం నా ల్యాప్‌టాప్‌లో డంప్ చేశాను. వాటిని వేర్వేరు ఫైల్స్ రూపంలో ఎడిట్ చేసి, FTP ద్వారా మొత్తం ఫీడ్ పంపించాను.

అప్పటికే మా వాలకం చూసి “ఏమైనా తిన్నారా?” అంటూ వాళ్లు మమ్మల్ని అడగడం, మేం మొహమాటంతోనే లేదు అని చెప్పడం జరిగిపోయాయి. వెంటనే వాళ్ల మెస్‌లో మా అందరికీ భోజనాలు సిద్ధం చేయించారు. మూడు రోజుల తర్వాత తెలుగింటి రుచితో కూడిన భోజనం చేశాం. అప్పటికే చీకటి కమ్ముకుంది.. తదుపరి కవరేజి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఇక మా హోటల్ (గెస్ట్ హౌజ్)కి వెళ్లిపోయాం.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు