బ్రేకింగ్.. జమ్మూ కాశ్మీర్.. భద్రతా దళాల కాల్పుల్లో 13 మంది ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లా.. నౌషేరా సెక్టార్ లో సోమవారం భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. దాదాపు అదే సమయంలో జమ్మూ డివిజన్ లోని నియంత్రణ రేఖ..

బ్రేకింగ్.. జమ్మూ కాశ్మీర్.. భద్రతా దళాల కాల్పుల్లో 13 మంది ఉగ్రవాదులు హతం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 01, 2020 | 7:59 PM

జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లా.. నౌషేరా సెక్టార్ లో సోమవారం భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. దాదాపు అదే సమయంలో జమ్మూ డివిజన్ లోని నియంత్రణ రేఖ వద్ద మెంధార్-పూంచ్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో 10 మంది టెర్రరిస్టులు హతులయ్యారు. మొత్తం 13 మంది టెర్రరిస్టులు మృతి చెందినట్టు సైనికాధికారులు తెలిపారు. గత నెల 28 నుంచి ఇక్కడ  ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు అణువణువూ గాలిస్తున్నాయి. ఈ తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులు కాశ్మీర్ లోయలోకి చొరబడేందుకు యత్నించారని సైనికవర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా… పూంచ్ జిల్లాలోని గ్రామాల్లో కూడా వీరికోసం వేట కొనసాగుతోంది.