జమ్మూలో బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కిష్టావర్ జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలోని దోడ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదస్థలికి చేరుకున్న ఇండో – టిబెటర్ బోర్డర్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుక్కున్న వారిని సురక్షితంగా బయటకు తీసి.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ బస్సు ప్రమాద ఘటనతో అక్కడ భారీగా ట్రాఫిక్ […]
జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కిష్టావర్ జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలోని దోడ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదస్థలికి చేరుకున్న ఇండో – టిబెటర్ బోర్డర్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుక్కున్న వారిని సురక్షితంగా బయటకు తీసి.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ బస్సు ప్రమాద ఘటనతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.