అన్నారం బ్యారేజ్ వద్ద “జల జాతర”… హాజరైన తెలంగాణ మంత్రులు

తెలంగాణ ప్రభుత్వం రికార్డ్ స్ధాయిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారం బ్యారేజ్ వద్ద జల జాతర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు సైతం ఈ జలజాతర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో సీమలో కోటి ఎకరాలకు నీరు అందుతుందన్నారు. కాళేశ్వరం జాతరను […]

అన్నారం  బ్యారేజ్ వద్ద జల జాతర... హాజరైన తెలంగాణ మంత్రులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 17, 2019 | 7:41 AM

తెలంగాణ ప్రభుత్వం రికార్డ్ స్ధాయిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారం బ్యారేజ్ వద్ద జల జాతర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు సైతం ఈ జలజాతర కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈసందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో సీమలో కోటి ఎకరాలకు నీరు అందుతుందన్నారు. కాళేశ్వరం జాతరను శ్రీరామ్ సాగర్ వద్ద నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణాంతో మిగిలిన ప్రాజెక్టులు నీటితో నిండి.. నిండు కుండలా మారుతున్నాయన్నారు.