జమ్ములో ఎన్కౌంటర్.. జైషే కమాండర్ హతం
జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు భద్రతాబలగాలు. వారిలో జైషే మహ్మద్కు చెందిన కమాండర్ ఫయాజ్ పంజా ఉన్నట్లు పోలీసులు నిర్దారించారు. దీనిపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. అనంత్నాగ్లోని బిజ్బెహరాలో జైషే కమాండర్ ఫయాజ్ పంజూతో పాటు అతడి సహాయకుడిని ముట్టుబెట్టాం. ఇది ఒక గొప్ప విజయం అని అన్నారు. కాగా ఈ ఏడాది జూన్ 12న అనంత్నాగ్ పట్టణంలో జరిగిన ఉగ్రదాడిలో పంజూ కీలకంగా […]
జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు భద్రతాబలగాలు. వారిలో జైషే మహ్మద్కు చెందిన కమాండర్ ఫయాజ్ పంజా ఉన్నట్లు పోలీసులు నిర్దారించారు. దీనిపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. అనంత్నాగ్లోని బిజ్బెహరాలో జైషే కమాండర్ ఫయాజ్ పంజూతో పాటు అతడి సహాయకుడిని ముట్టుబెట్టాం. ఇది ఒక గొప్ప విజయం అని అన్నారు. కాగా ఈ ఏడాది జూన్ 12న అనంత్నాగ్ పట్టణంలో జరిగిన ఉగ్రదాడిలో పంజూ కీలకంగా వ్యవహరించాడు. ఈ దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు ఓ పోలీస్ అధికారి మృతి చెందిన విషయం తెలిసిందే.