జగిత్యాల జిల్లాలో కొత్తగా 12 మందికి కరోనా..!
రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది కరోనా వైరస్. తెలంగాణ ప్రభుత్వ కట్టడి చర్యల్లో భాగంగా కొంత తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు.. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారితో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జగిత్యాల జిల్లాలో వలస కార్మికులతో కరోనా విజృంభిస్తోంది. ముంబై నుంచి వచ్చిన మరో 12 మంది వలస కూలీలకు ఇవాళ కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. మల్యాల మండలంలో ఆరుగురికి, మేడిపల్లి మండలంలో ముగ్గురికి, గొల్లపల్లి, కోరుట్ల, కథలాపూర్ మండలాలలో […]
రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది కరోనా వైరస్. తెలంగాణ ప్రభుత్వ కట్టడి చర్యల్లో భాగంగా కొంత తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు.. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారితో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జగిత్యాల జిల్లాలో వలస కార్మికులతో కరోనా విజృంభిస్తోంది. ముంబై నుంచి వచ్చిన మరో 12 మంది వలస కూలీలకు ఇవాళ కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. మల్యాల మండలంలో ఆరుగురికి, మేడిపల్లి మండలంలో ముగ్గురికి, గొల్లపల్లి, కోరుట్ల, కథలాపూర్ మండలాలలో ఒక్కొక్కరి చొప్పున కరోన కేసులు నమోదయ్యాయి. ఇలా ఉంటే జిల్లాలో ఇప్పటివరకు 54 కేసులు నమోదు కాగా 49యాక్టీవ్ కేసులున్నాయి. వారిలో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు మృతి చెందినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.