జగన్ ఒక రోజంతా ప్రచారానికి దూరంగా ఉండటంపై చంద్రబాబు అనుమానం

విజయవాడ: జగన్ మరో కుట్రకు ప్లాన్ చేస్తున్నాడు జాగ్రత్త అంటూ పార్టీ నాయకులను టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ టెక్నాలజీని బాగా వినియోగించే చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో టచ్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ జగన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మరో కుట్రకు ప్లాన్ చేస్తున్నాడు, జాగ్రత్త అంటూ పార్టీ నాయకులను హెచ్చరించారు. ఇందుకు కారణం జగన్ […]

జగన్ ఒక రోజంతా ప్రచారానికి దూరంగా ఉండటంపై చంద్రబాబు అనుమానం
Follow us

|

Updated on: Apr 03, 2019 | 2:01 PM

విజయవాడ: జగన్ మరో కుట్రకు ప్లాన్ చేస్తున్నాడు జాగ్రత్త అంటూ పార్టీ నాయకులను టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ టెక్నాలజీని బాగా వినియోగించే చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో టచ్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ జగన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

జగన్ మరో కుట్రకు ప్లాన్ చేస్తున్నాడు, జాగ్రత్త అంటూ పార్టీ నాయకులను హెచ్చరించారు. ఇందుకు కారణం జగన్ ప్రచారం ఆపేసి ఒక రోజంతా లోటస్ పాండ్‌లోనే గడపడం. ఇంతకీ జగన్ ఏం చేశారంటే సోమవారం ఎన్నికల ప్రచారం ముగించుకుని నేరుగా లోటస్ పాండ్‌కి వెళ్లారు. మంగళవారం ప్రచారం కొనసాగించకుండా విశ్రాంతికి ప్రాముఖ్యతనిచ్చారు. అయితే ఆ సమయంలో పార్టీకి సంబంధించిన కీలక నాయకులతో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు తెలుస్తోంది. జిల్లాల వారీగా స్థానిక నాయకులతో సమీక్షలు నిర్వహించారట.

ఈ నేపథ్యంలో జగన్ ఒక రోజంతా పూర్తిగా ప్రచారానికి దూరంగా ఉండటంతో ఏదో కుట్రకు ప్లాన్ చేస్తున్నారు జాగ్రత్త అంటూ పార్టీ నాయకులకు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.