బ్రేకింగ్: జగన్, కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు..!
ఆంద్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఇక ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన అనంతరం వీరిద్దరూ, గవర్నర్ తో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి వెళ్లాల్సి ఉంది. అయితే ఆఖరి క్షణంలో వారు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. Also Read: లైవ్ అప్డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం ప్రధాని మోదీ […]
ఆంద్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఇక ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన అనంతరం వీరిద్దరూ, గవర్నర్ తో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి వెళ్లాల్సి ఉంది. అయితే ఆఖరి క్షణంలో వారు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.
Also Read: లైవ్ అప్డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం
ప్రధాని మోదీ ప్రమాణస్వీకారానికి పలు దేశాల నుంచి కీలక వ్యక్తులు ఢిల్లీకి వస్తున్న నేపథ్యంలో.. ముందుగా అనుమతి లేని విమానాలను అనుమతించమని పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. దీంతో వీరు వెళ్లడం లేదని అధికార వర్గాల సమాచారం..