విశాఖ దిశగా జగన్ మరో అడుగు: ఈసారి భారీ స్థాయిలో..
విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా అడుగులు వేగంగా వేస్తున్న సంకేతాలు అందుతున్నాయి. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిన దరిమిలా.. మండలి రైద్దైన క్రమంలో ఇక మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అందులో భాగంగా విశాఖలో పనులకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విశాఖలో ప్రస్తుతం అందుబాటులో వున్న ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను వినియోగించుకునేందుకు రంగం సిద్దమవుతోంది. ఆ తర్వాత క్రమంలో […]
విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా అడుగులు వేగంగా వేస్తున్న సంకేతాలు అందుతున్నాయి. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిన దరిమిలా.. మండలి రైద్దైన క్రమంలో ఇక మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అందులో భాగంగా విశాఖలో పనులకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
విశాఖలో ప్రస్తుతం అందుబాటులో వున్న ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను వినియోగించుకునేందుకు రంగం సిద్దమవుతోంది. ఆ తర్వాత క్రమంలో విశాఖ, దాని చుట్టుపక్కన అందుబాటులో వున్న ప్రభుత్వ భూములను గుర్తించాలని అధికార యంత్రాగానికి ఆదేశాలు అందాయి. అదే క్రమంలో మరింత భూములు అవసరమని భావిస్తున్న ప్రభుత్వం.. దానికి పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్కు సిద్దమవుతోంది.
విశాఖ చుట్టుపక్కల వున్న 10 మండలాల పరిధిలో భూ సమీకరణకు నిర్దిష్టమైన ఆదేశాలు జిల్లా కలెక్టర్కు అందినట్లు చెబుతున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయని తెలుస్తోంది. జీవో నెంబర్ 72 ద్వారా సుమారు 6వేల పైచిలుకు ఎకరాలు సేకరించాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగా అర్బన్ హౌసింగ్ కోసం భూములు తీసుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. సేకరించిన భూముల అభివృద్ధి బాధ్యతలు విఎంఆర్డీఏకు అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.