‘జబర్దస్త్’ వీక్షకులకు గుడ్ న్యూస్..షూటింగ్ మొదలైందోచ్..
కోవిడ్-19 నేపథ్యంలో గత మూడు నెలలుగా సినిమా, సీరియల్స్, షో షూటింగ్స్ పూర్తిగా బంద్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓల్డ్ ఎపిసోడ్స్ ప్లే చేశాయి అన్ని చానల్స్.
కోవిడ్-19 నేపథ్యంలో గత మూడు నెలలుగా సినిమా, సీరియల్స్, షో షూటింగ్స్ పూర్తిగా బంద్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓల్డ్ ఎపిసోడ్స్ ప్లే చేశాయి అన్ని చానల్స్. దీంతో అసలే పనులు లేక ఇంట్లో కూర్చుండిపోయిన బుల్లితెర ప్రేక్షకులు చాలా బోర్ ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు ‘జబర్దస్త్’, ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ తో పాటు సీరియల్స్ చూసే ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ప్రభుత్వాల నుంచి పర్మిషన్స్ రావడంతో అన్ని షూటింగ్స్ మొదలవుతున్నాయి. ఇప్పటికే ‘మనసు మమత’, ‘స్వాతి చినుకులు’ సీరియల్స్ షూటింగ్స్ ప్రారంభం అవ్వగా..తాజాగా బుల్లితెర సూపర్ హిట్ కామెడీ షోస్..’జబర్దస్త్’, ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ షూటింగులు సైతం ప్రారంభమయ్యాయి.
రామానాయుడు స్టూడియోస్లో వేసిన స్పెషల్ సెట్లో కొత్త షెడ్యూల్ మొదలైంది. ఇప్పటికే ఓ రెండు ఎపిసోడ్స్ షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు సమాచారం. త్వరలోనే అవి ఎడిటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్దమవుతున్నాయి. ప్రభుత్వ మార్గనిర్దేశకాలకు అనుగుణంగానే చిత్రీకరణలు జరుపుతున్నట్టు చెబుతోంది ప్రముఖ నిర్మాణ సంస్థ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. ఇక ‘జబర్దస్త్’ అనసూయ సైతం తన గ్లామర్ తో ప్రేక్షకులకు మత్తెక్కించేందుకు సిద్దమైపోయింది. అయితే ఓ ఇద్దరు టీమ్ లీడర్స్ ను తప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.