కరోనా కట్టడిలో.. జబల్పూర్ టాప్..
ఓ వైపు కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ పంజా విసురుతోంది. దీని నివారణకు విరుగుడుగా లాక్డౌన్ విధించారు. ఇప్పటికే ప్రపంచంలోని సగం పైగా
ఓ వైపు కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ పంజా విసురుతోంది. దీని నివారణకు విరుగుడుగా లాక్డౌన్ విధించారు. ఇప్పటికే ప్రపంచంలోని సగం పైగా ప్రజలు వారి వారి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేసిన జబల్పూర్లో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. దీంతో యావత్ దేశం దృష్టి జబల్పూర్పై పడింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ పారిశ్రామికంగా పెద్దనగరం. నగరంలో దాదాపు 20 లక్షల జనాభా ఉంది.
కోవిద్ 19 ఇప్పుడు దేశమంతా విస్తరిస్తోంది. దుబాయ్ నుంచి నగరానికి తిరిగి వచ్చిన వ్యాపారి కుటుంబానికి చెందిన ముగ్గురు, జర్మనీ నుంచి విద్యార్థికి మార్చి 20న కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో నగరంలో తొలిసారిగా నలుగురికి వైరస్ సోకినట్టు అధికార యంత్రాంగం ప్రకటించింది. ఈ నలుగురూ విదేశాల నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. మార్చి 21న నగరంలో లాక్డౌన్ విధించారు. ఈ నలుగురూ ఎవరెవర్ని కలుసుకున్నారో తెలుసుకొని వారికి పరీక్షలు నిర్వహించారు. వీరందరినీ గృహ నిర్బంధంలో ఉంచారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నవారిని ఆసుపత్రి క్వారంటైన్కు తరలించారు.
కాగా.. కరోనా కట్టడి కోసం ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. కలెక్టర్, ఎస్పీలు లాక్డౌన్ను పటిష్ఠంగా అమలుచేసేందుకు వివిధ విధానాలను అమలుచేశారు. పోలీసులు నగర సరిహద్దులను మూసివేశారు. నిత్యావసరాలు కొనుగోలుకు మాత్రం ప్రజలను తక్కువ సంఖ్యలో అనుమతించారు. భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం నగరంలో గత 12 రోజులుగా కొత్త కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని అధికార యంత్రాంగం తెలిపింది.