పూంచ్ సెక్టార్లో కాల్పులకు తెగబడుతున్న పాక్
పాకిస్థాన్ మరోసారి తన వక్ర బుద్దిని ప్రదర్శిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత సరిహద్దుల వైపు కాల్పులకు తెగబడుతోంది.
పాకిస్థాన్ మరోసారి తన వక్ర బుద్దిని ప్రదర్శిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత సరిహద్దుల వైపు కాల్పులకు తెగబడుతోంది. గడిచిన కొద్ది రోజుల నుంచి రెగ్యులర్గా కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘిస్తూ సరిహద్దు వెంట కాల్పులకు దిగుతోంది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో పూంచ్ సెక్టార్ మీదుగా కాల్పులకు దిగినట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు. పాక్ కాల్పులను భారత ఆర్మీ తిప్పికొట్టిందని పేర్కొంది. శుక్రవారం నాడు కూడా కిర్నీ సెక్టార్ వద్ద మోర్టార్ షెల్స్ ఉపయోగించి కాల్పులకు దిగింది. లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో ఉగ్రవాదులు దేశంలో చొరబడేందుకు వీలుగా పాక్ ఆర్మీ ఈ కుట్రలకు పాల్పడుతుందని తెలుస్తోంది.
Pakistan violates ceasefire along Line of Control in Kirni & Qasba sectors in Poonch, Jammu and Kashmir. Indian Army is retaliating.
— ANI (@ANI) June 6, 2020