అక్కడ స్థిరంగా కరోనా కేసులు- ఒకింత నెమ్మదించిన ఉధృతి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరణ మృదంగం కొనసాగుతోంది. ఈ వైరస్కు బలైనవారి సంఖ్య 2 లక్షలు దాటింది. బాధితుల సంఖ్య కూడా 30 లక్షలకు చేరువైంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరణ మృదంగం కొనసాగుతోంది. ఈ వైరస్కు బలైనవారి సంఖ్య 2 లక్షలు దాటింది. బాధితుల సంఖ్య కూడా 30 లక్షలకు చేరువైంది. బాధితులు, మరణాల్లో అత్యధికంగా అమెరికా, ఐరోపా దేశాల్లో చోటుచేసుకుంటున్నాయి. ఇక, కేసుల్లో మూడో వంతు, మరణాల్లో నాలుగో వంతు ఒక్క అమెరికాలోనే నమోదయినట్టు జాన్ హాప్కిన్స్ వర్సిటీ విశ్లేషించింది. స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీల్లో మొత్తం కేసుల కంటే అగ్రరాజ్యంలోనే ఎక్కువ మంది వైరస్ బారినపడటం గమనార్హం. ఇక ఇటలీలో కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే కాస్తా శాంతిస్తోంది.
మొన్నటి వరకు ఇటలీలో కరోనా మృత్యుఘోశ వినిపించింది. లక్షల మంది ప్రజలు వైరస్ బారిన పడగా, రోజుకు వందలు, వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. కరోనా ధాటికి అల్లాడిపోయిన ఇటలీలో ప్రస్తుతం కరోనా ఉధృతి ఒకింత నెమ్మదించినట్లుగా కనిపిస్తున్నది. గతంతో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరగడం లేదు. ఆదివారం (ఏప్రిల్ 26) ఉదయానికి ఇటలీలో కరోకా పాజిటివ్ కేసుల సంఖ్య 1, 95, 351కి చేరుకుంది. 26 384 మంది మరణించారు. కరోనా సోకి చికిత్స అనంతరం కోలుకున్న వారి సంఖ్య 63, 120 కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 1.05, 847. వీరిలో 2, 102 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇటలీ ప్రభుత్వం తెలిపింది.