కల్కి భగవాన్ ఇంతకీ ఎక్కుడున్నట్టు?

వివాదాస్పద కల్కిభగవాన్ ఆశ్రమంపై దాడులు జరిపిన ఐటీ శాఖ అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా భారీగా నగదు, వజ్రాభరణాలు లభ్యమయ్యాయి. అదేవిధంగా ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సిన దాదాపు రూ.500 కోట్ల విలువైన ఆస్తులను కూడా అధికారులు గుర్తించారు. భక్తి ముసుగులో కల్కిభగవాన్ సాగించిన వ్యవహారాలపై తాజాగా చర్చ మొదలైంది. అయితే గత కొంత కాలంగా కల్కిభగవాన్ అలియాస్ విజయ్‌కుమార్ నాయడు, ఆయన భార్య అమ్మా భగవాన్ అలియాస్ పద్మావతి కనిపించడం లేదు. వీరి అదృశ్యంపై భక్తులు […]

కల్కి భగవాన్ ఇంతకీ  ఎక్కుడున్నట్టు?
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2019 | 8:46 PM

వివాదాస్పద కల్కిభగవాన్ ఆశ్రమంపై దాడులు జరిపిన ఐటీ శాఖ అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా భారీగా నగదు, వజ్రాభరణాలు లభ్యమయ్యాయి. అదేవిధంగా ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సిన దాదాపు రూ.500 కోట్ల విలువైన ఆస్తులను కూడా అధికారులు గుర్తించారు. భక్తి ముసుగులో కల్కిభగవాన్ సాగించిన వ్యవహారాలపై తాజాగా చర్చ మొదలైంది. అయితే గత కొంత కాలంగా కల్కిభగవాన్ అలియాస్ విజయ్‌కుమార్ నాయడు, ఆయన భార్య అమ్మా భగవాన్ అలియాస్ పద్మావతి కనిపించడం లేదు. వీరి అదృశ్యంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత రెండు రోజులుగా ఐటీ అధికారులు వరదయ్యపాళెం సహా పలు ఆశ్రమాల్లో ఏకకాలంలో దాడులు చేసి పెద్ద ఎత్తున స్వదేశీ, విదేశీ కరెన్సీ , నగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయిదు కోట్లు విలువ చేసే వజ్రాలు, రూ.26 కోట్లు విలువ చేసే 88 కేజీల బంగారం, రూ.40,.39 కోట్ల నగదుతో పాటు రూ.18 కోట్ల విదేశీ కరెన్సీ, మొత్తం రూ.93 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిపై కల్కిభగవాన్ కుమారుడు కృష్ణ, ఆయన భార్య ప్రీతిలను చెన్నైకి తరలించి విచారిస్తున్నారు. ఇంత జరుగుతున్న కల్కిభగవాన్, ఆయన సతీమణి పద్మావతిల జాడ కనిపించలేదు. ఇంతకీ వీరు ఎక్కడ ఉన్నారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉంటే కల్కి భక్తుల్లో విదేశీ భక్తుల కూడా ఉన్నారు. వీరిలో కొంతమంది మహిళలు అదృశ్యం కావడంపై ఆరోపణలున్నాయి. కల్కిభగవాన్‌కు ఏకంగా స్విస్ బ్యాంకులో అకౌంట్ కూడా ఉందిని అందులో వేలకోట్ల రూపాయలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడు ప్రాంతంలో వెయ్యి ఎకరాల్లో భూములు, వివిధ కంపెనీల్లో పెట్టుబడులు కూడా ఉన్నట్టుగా సమాచారం. అయితే ఇవన్నీ వీరిపేరున కాకుండా పలువురు బినామీల పేరుతో కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. కల్కి భగవాన్‌ కుమారుడు కృష్ణాజీ బెంగళూరులో రూ.1000 కోట్ల పెట్టుబడితో రియల్‌ఎస్టేట్‌ కంపెనీ, లాస్‌ఏంజెల్స్‌లో మరో కంపెనీలు నడుపుతున్న నేపథ్యంలో 400 మంది ఐటీ అధికారులు ఏకకాలంలో 40 కల్కి కేంద్రాలపై బుధవారం నుంచి మెరుపుదాడులు జరిపారు.

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??