ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు గడువు పొడిగింపు
కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ గడువు మరో రెండు నెలలు పొడిగించింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ గడువు మరో రెండు నెలలు పొడిగించింది. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి నవబర్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు బుధవారం ఒక ట్వీట్ చేసింది. నిజానికి ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగిసిపోయింది. గడువు పొడిగింపు ఇది నాల్గవసారి. అదే సమయంలో 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకూ గడువు పెంచింది.
On further consideration of genuine difficulties being faced by taxpayers due to the Covid-19 situation, CBDT further extends the due date for furnishing of belated & revised ITRs for Assessment Yr 2019-20 from 30th September, 2020 to 30th November, 2020.Order u/s 119(2a) issued. pic.twitter.com/QQii6qG3pt
— Income Tax India (@IncomeTaxIndia) September 30, 2020
కోవిడ్-19 నేపథ్యంలో రిటర్న్స్ దాఖలు విషయంలో కొన్ని అవరోధాలు ఏర్పడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి అసెస్మెంట్ ఇయర్ 2019–20 అవుతుంది. అంటే 2020 మార్చినాటికి 2018–19 ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, కరోనా విసృంభణ కారణంగా దీనిని తొలుత జూన్ 30 వరకూ సీబీడీటీ పొడిగించింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మళ్లీ జూలై 31 వరకూ పెంచింది. జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కొన్ని అధిక విలువలు కలిగిన లావాదేవీలు జరిగాయని పేర్కొంటూ, కొందరికి ఆదాయపు పన్ను శాఖ ఇటీవల సమాచారం కూడా అందించింది. అలాగే, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు గడువు పొడిగిస్తూ ఈ-మెయిల్ను పంపుతోంది.
మరోవైపు, 2018-19 వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వార్షిక రిటర్న్స్, ఆడిట్ రిపోర్ట్ దాఖలుకు (జీఎస్టీఆర్-9, జీఎస్టీఆర్ 9సీ) గడువును మరోనెల అంటే అక్టోబర్ 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు సీబీఐసీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్డ్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్) మరో ట్వీట్లో ప్రకటించింది. మేలో ఈ గడువును సీబీఐసీ మూడు నెలల పాటు అంటే సెప్టెంబర్ వరకూ పొడిగించింది.
One time relaxation in implementation of E-Invoice Provisions for the month of October, 2020. @FinMinIndia @nsitharamanoffc @ianuragthakur pic.twitter.com/eNq2VPHyeh
— CBIC (@cbic_india) September 30, 2020