శశికళకు ఆర్ధిక కట్టడి.. వేద నిలయం సమీపంలోని బిల్డింగ్ సీజ్
అన్నాడిఎంకే మాజీ నేత శశికళ రాజకీయ ఆలోచనలపై ఐటి శాఖ అధికారులు నీళ్లు చల్లారు. జయలలిత సన్నిహితురాలు శశికళ జైలు నుంచి బయటకు రాకమునుపే ఆమె ఆస్తులన్నింటినీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు.
అన్నాడిఎంకే మాజీ నేత శశికళ రాజకీయ ఆలోచనలపై ఐటి శాఖ అధికారులు నీళ్లు చల్లారు. జయలలిత సన్నిహితురాలు శశికళ జైలు నుంచి బయటకు రాకమునుపే ఆమె ఆస్తులన్నింటినీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. శశికళ ఆస్తుల్లో అధిక భాగం ఇప్పటికే ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
ఇందులో బహుళ అంతస్థుల భవనంతో పాటు మరో 65 ఆస్తులు ఉన్నాయి. బినామీ కంపెనీ ద్వారా శశికళ ఈ ఆస్తులను కూడబెట్టినట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. ఇందులో అనేకం షెల్ కంపెనీలుగా తేల్చింది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో శశికల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
కేవలం పెద్దనోట్ల రద్దు సమయంలోనే దాదాపు 16వందల కోట్ల ఆస్తులను శశికళ కొనుగోలు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో పాటు 237 కోట్ల పాతనోట్లను ఒక వ్యాపారికి శశికళ రుణంగా ఇచ్చారని కూడా తమిళన రాజకీయాల్లో ఓ చర్చ కూడా ఉంది.
బెంగళూరు జైలులో ఉన్న శశికళకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో శశికళను పూర్తిగా ఆర్థికంగా దిగ్భంధనం చేసినట్లయింది. ఇక శశికళ జైలు నుంచి విడుదలయిన తర్వాత జయలలిత నివసించిన వేదనియలం ఎదురుగా ఉన్న స్థలంలో భవనం నిర్మించుకుని ఉందామనుకున్నారు. భవన నిర్మాణపనులు కూడా ప్రారంభమయ్యాయి..అయితే ఇదంతా ఓ ఆమె అనుచరులు చూస్తుండటంతో.. అధికారులు కూపీలాగారు. దీంతో బినామీ వ్యవహారం కదిలింది. దీంతో వారకిి కూాడా నోటీసులు జారీ చేేసిన అధికారులు ఆ నిర్మాణంను జప్తు చేశారు. దీంతో శశికళను పూర్తి స్థాయిలో ఆర్ధిక కట్టడి చేసినట్లైంది.