మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో విబేధాలు.. ఆగిన రవితేజ మూవీ..!
ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్లో నటిస్తోన్న మాస్రాజా రవితేజ.. ఆ తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో నటించబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. హవీష్ ప్రొడక్షన్స్లో కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయంలో ఇప్పుడు రవితేజ, రమేష్ వర్మ మధ్య కోల్డ్వార్ జరుగుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్ను అనుకున్నారట రమేష్ వర్మ. ఇందుకు […]
ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్లో నటిస్తోన్న మాస్రాజా రవితేజ.. ఆ తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో నటించబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. హవీష్ ప్రొడక్షన్స్లో కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయంలో ఇప్పుడు రవితేజ, రమేష్ వర్మ మధ్య కోల్డ్వార్ జరుగుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
అదేంటంటే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్ను అనుకున్నారట రమేష్ వర్మ. ఇందుకు సంబంధించి అతడితో సంప్రదింపులు కూడా జరిపారట. కానీ రవితేజ మాత్రం థమన్ కావాలని చెబుతున్నారట. తన చాలా చిత్రాలకు థమన్ మంచి సంగీతం అందించాడని, క్రాక్కి కూడా మంచి సంగీతం ఇచ్చాడని భావిస్తోన్న రవితేజ.. ఈ మూవీకి అతడినే తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే థమన్ విషయంలో దర్శకుడికి ఎలాంటి ప్రత్యేక ఇబ్బందులు లేకపోయినప్పటికీ.. డీఎస్పీ అయితేనే బావుంటుందని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ విషయంలో ఇద్దరి మధ్య సమస్య మొదలైందని, దీంతో సినిమాను ఆపివేశారని టాక్ నడుస్తోంది. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read This Story Also: Big Breaking: వీడిన వరంగల్ గొర్రెకుంట బావి కేసు..!