సోషల్ మీడియాపై నియంత్రణకు దారేది ?

విచ్చలవిడిగా విస్తరిస్తున్న సోషల్ మీడియా మాధ్యమం యువతను.. ఆ మాటకొస్తే పిల్లల్ని సైతం పక్కదారి పట్టిస్తోంది. ఇంకా చెప్పాలంటే చెడు మార్గానికి తోసేస్తున్నది. ఇలా పట్టపగ్గాల్లేకుండా పోయిన సామాజిక మాధ్యమాలను నియంత్రించాలని, అందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ఖరారు చేయడానికి ఎంత సమయం తీసుకుంటారో 3 వారాల్లో తేల్చాలని భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల్లో నివేదికను కోర్టు ముందుంచాలని నిర్దేశించింది. తమపై వివిధ హైకోర్టుల్లో ఉన్న కేసుల్ని సుప్రీంకోర్టుకు బదిలీ […]

సోషల్ మీడియాపై నియంత్రణకు దారేది ?
Follow us

| Edited By:

Updated on: Oct 16, 2019 | 4:49 PM

విచ్చలవిడిగా విస్తరిస్తున్న సోషల్ మీడియా మాధ్యమం యువతను.. ఆ మాటకొస్తే పిల్లల్ని సైతం పక్కదారి పట్టిస్తోంది. ఇంకా చెప్పాలంటే చెడు మార్గానికి తోసేస్తున్నది. ఇలా పట్టపగ్గాల్లేకుండా పోయిన సామాజిక మాధ్యమాలను నియంత్రించాలని, అందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ఖరారు చేయడానికి ఎంత సమయం తీసుకుంటారో 3 వారాల్లో తేల్చాలని భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల్లో నివేదికను కోర్టు ముందుంచాలని నిర్దేశించింది. తమపై వివిధ హైకోర్టుల్లో ఉన్న కేసుల్ని సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యేలా ఆదేశాలివ్వాలని ఫేస్‌బుక్‌ దాఖలు చేసిన పిటిషన్‌పైనా, సోషల్ మీడియా ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించాలన్న నిబంధనలపై దాఖలైన పిటిషన్‌పైనా విచారిస్తున్న సందర్భంగా ఈ ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ గుప్తా చేసిన వ్యాఖ్యలు కూడా ఆలోచించదగ్గవి. సాంకేతిక పరిజ్ఞానం హద్దులు దాటి ప్రమాదకరంగా మారుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ చుట్టూ రోజూ చూస్తున్న, వింటున్న ఉదంతాల గురించి ఆలోచించినప్పుడు న్యాయమూర్తి వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏకీభవించనివారుండరు.

సోషల్ మీడియా యాప్స్ కానీ, వెబ్ సైట్స్ కానీ.. అన్నింటినీ నిందించలేం. కానీ వాటిని వినియోగించే వ్యక్తుల మానసిక స్థితి, ప్రవర్తన వంటివి విశేషంగా ప్రభావం చూపుతాయి. సామాజిక మాధ్యమాలు రెండువైపులా పదునున్న కత్తిలాంటివి. వాటిని సమర్థవంతంగా వినియోగించుకుని తాము ఎదుగుతూ, చుట్టూ ఉన్న సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లేవారున్నట్టే… అందులో లభ్యమయ్యే గోప్యతను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం చెలరేగుతూ సమస్యా త్మకంగా మారుతున్నవారూ ఉన్నారు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్‌ వంటి మాధ్యమాలను నిత్యం ప్రపంచవ్యాప్తంగా వందలకోట్లమంది వీక్షిస్తున్నారు. తమ తమ అభి ప్రాయాలను పంచుకుంటున్నారు. ఒకరి మస్తిష్కంలో రగుల్కొనే ఒక ఆలోచన మరుక్షణం లక్షలాది మందికి దావానలంలా వ్యాపిస్తోంది. ఇలా వ్యాపించేసిన ఆలోచన పలు రకాలుగా సమాజం మీద ప్రభావాన్ని చూపుతోంది. సోషల్ మీడియా మాధ్యమాలు సెల్‌ఫోన్లలో ఇమిడి పోవడంతో ఇదంతా సాధ్యమవుతోంది.

ఈ సామాజిక మాధ్యమాల తీరుతెన్నులపై, వాటి పర్యవసానాలపై అంతక్రితం నుంచీ సాగు తున్న చర్చ ఈ ఏడాది మార్చి నెలలో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌ చర్చి నగరంలో ఒక ఉన్మాది మసీ దుల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు సాగించి 51మందిని పొట్టనబెట్టుకున్న అనంతరం మరింత తీవ్రంగా సాగుతోంది. నాలుగు నెలలక్రితం పారిస్‌లో ప్రపంచ దేశాల అధినేతలూ, సామాజిక మాధ్యమాల అధిపతులూ ఈ ఘటనపైనే శిఖరాగ్ర సదస్సు జరిపారు. ఆన్‌లైన్‌లో ఉగ్రవాదం, తీవ్రవాదం విస్తరించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపైనే వీరు దృష్టి కేంద్రీకరించారు. విద్వేషపూరిత భావాల వ్యాప్తిని సామాజిక మాధ్యమాల్లో సాగనీయబోమని మన దేశంతోసహా 17 దేశాలూ… 8 సామాజిక మాధ్యమాలు ప్రకటించాయి. అదే సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు కట్టుబడి ఉండాలని తీర్మానించాయి. వ్యక్తులుగా అనేకులు సామాజి మాధ్య మాల వల్ల లాభపడుతున్నట్టే, వాటివల్ల సమస్యలు ఎదుర్కొంటున్నవారు, వాటి కారణంగా మాన సిక ప్రశాంతత కరువైనవారు ఉన్నారు. ఎవరో, ఏమిటో అవతలివారికి తెలిసే అవకాశం లేదు కనుక ఇష్టానుసారం వ్యాఖ్యానించి, దూషించి ఇబ్బందులకు గురిచేస్తున్న నేరగాళ్లకు సామాజిక మాధ్యమాల్లో కొదువలేదు. ముఖ్యంగా మహిళలు ఇందువల్ల తీవ్ర సమస్యలెదుర్కొంటున్నారు.

రెండేళ్లక్రితం ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని, దేశ రక్షణ విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయిన సైనికాధికారి కుమార్తె గుర్‌మెహర్‌ కౌర్‌ ఒక ట్వీట్‌లో తన తండ్రిని చంపింది పాకిస్తాన్‌ కాదని… యుద్ధమని చెప్పినందుకు ఆమెపై దుండగులు ఎలా చెలరేగిపోయారో ఎవరూ మరిచిపోరు. ఆమె మనస్సును ఎవరో కలుషితం చేశారన్నవారి దగ్గర నుంచి ఆమెపై అత్యాచారం చేస్తామని, అత్యంత పాశవికంగా హతమారుస్తామని బెదిరించినవారి వరకూ ఎందరో ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పశు మాంసం దగ్గరుంచుకున్నారని, ఆవుల్ని కబేళాలకు తరలిస్తున్నారని, పిల్లల్ని అపహరించే ప్రయత్నం చేశారని రకరకాల ముద్రలేసి వ్యక్తుల్ని కొట్టి చంపిన ఘటనలు అనేకం. సామాజిక మాధ్యమాల్లో దుండగులు వదంతులు వ్యాప్తి చేసి ఈ మూకదాడులకు పాల్పడుతు న్నారు. ఇది మన దేశానికి మాత్రమే పరిమితమైన దుర్లక్షణం కాదు. అన్ని దేశాలకూ ఈ రోగం వ్యాపించింది. సామాజిక మాధ్యమాలకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదు. కనుకనే కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఫేస్‌బుక్‌పై అటువంటి కేసులే ఉన్నాయి. ఈ మాధ్య మాల ద్వారా వేలకోట్లు ఆర్జిస్తున్న సంస్థలు తగిన స్థాయిలో మానవ వనరులను వినియోగిం చుకుంటే వీటిని అరికట్టడం పెద్ద కష్టం కాదు. తరచు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నవారిని గుర్తించి అడ్డుకోవడం సమస్య కాదు. కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తే సరిపోతుందని సామాజిక మాధ్యమాలు భావిస్తున్నాయి.ఆచరణలో ఫలితాలెలా ఉంటున్నాయో తెలుస్తూనే ఉంది.

అయితే సోషల్ మీడియాను నియంత్రించడం ఎవరి బాధ్యత ? ఈ విషయంపై కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా నియంత్రణను పూర్తిగా ప్రభుత్వాలకు వదిలేయడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందన్న అభిప్రాయం బలంగానే ఉన్నది. చట్టంలో అస్పష్టతకు తావులేకుండా, నేర నిర్వచనం స్పష్టంగా ఉంటే వేరుగానీ, లేనట్టయితే ఆ వంకన ఎవరినైనా నిర్బంధించడానికి ప్రభుత్వాలు సిద్ధపడతాయి. తమను ప్రశ్నించినవారిని, తమ నిర్ణయాలను విమర్శించినవారిని ప్రభుత్వాలు ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏ కింద నిర్బంధించిన ఉదంతాలు చూశాక ఆ సెక్షన్‌ రాజ్యాంగవిరుద్ధమని సుప్రీంకోర్టు 2015లో తీర్పునిచ్చింది. వాస్తవానికి ఇప్పుడున్న చట్టాలను సరిగా వినియోగిస్తే ఆన్‌లైన్‌ దుండ గుల్ని అదుపు చేయడం కష్టం కాదు. భారతీయ శిక్షాస్మృతిలోని పలు నిబంధనలు ఆన్‌లైన్‌లో మహి ళలను వేధించేవారిని, అసభ్యకరమైన సందేశాలను, చిత్రాలను పంపేవారిని, ఆన్‌లైన్‌లో వెంటబడే వారిని శిక్షించడానికి వీలు కల్పిస్తున్నాయి. వాటన్నిటినీ క్రోడీకరించి సమగ్రమైన చట్టం రూపొందిం చడమే ఉత్తమం. ఈ దిశగా కేంద్రం చర్యలు చేపట్టడం తక్షణ కర్తవ్యం. మరి మూడు వారాల్లో సమర్పించే కేంద్రం నివేదిక దేశానికి ఎలాంటి దిశానిర్దేశం చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.

కరివేపాకు నీటితో ఇన్ని లాభాలున్నాయా.? అవేంటో తెలిస్తే..
కరివేపాకు నీటితో ఇన్ని లాభాలున్నాయా.? అవేంటో తెలిస్తే..
ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో పన్ను విధానం మార్చవచ్చా..?
ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో పన్ను విధానం మార్చవచ్చా..?
బిజినెస్‌ ఐడియా..బ్రెడ్‌ వ్యాపారంతో లక్షల్లో లాభం.. ఎలాంగంటే..
బిజినెస్‌ ఐడియా..బ్రెడ్‌ వ్యాపారంతో లక్షల్లో లాభం.. ఎలాంగంటే..
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.