‘పవన్’ ఓడిపోవడానికి మితిమీరిన ఆత్మవిశ్వాసమే కారణం..!

తాజాగా.. జరిగిన ఎన్నికల పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు సినీ నటుడు, వైసీపీ నేత పృధ్వీరాజ్. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కన్నబాబు గతంలో చిరంజీవి వద్ద పీఆర్వోగా పనిచేశారని, అతనిపై అభిమానంతో ప్రజారాజ్యం పార్టీలో అవకాశం ఇచ్చిన అన్నయ్యని కన్నబాబు మోసం చేశారని, అలాంటి వ్యక్తిని తరిమికొట్టాలని, తాటతీయాలని పవన్ చేసిన వ్యాఖలతోనే ఆపార్టీపై వ్యతిరేకత వచ్చిందని అన్నారు. అయినా పీఆర్వోగా పనిచేసిన వ్యక్తి […]

'పవన్' ఓడిపోవడానికి మితిమీరిన ఆత్మవిశ్వాసమే కారణం..!
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2019 | 3:53 PM

తాజాగా.. జరిగిన ఎన్నికల పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు సినీ నటుడు, వైసీపీ నేత పృధ్వీరాజ్. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కన్నబాబు గతంలో చిరంజీవి వద్ద పీఆర్వోగా పనిచేశారని, అతనిపై అభిమానంతో ప్రజారాజ్యం పార్టీలో అవకాశం ఇచ్చిన అన్నయ్యని కన్నబాబు మోసం చేశారని, అలాంటి వ్యక్తిని తరిమికొట్టాలని, తాటతీయాలని పవన్ చేసిన వ్యాఖలతోనే ఆపార్టీపై వ్యతిరేకత వచ్చిందని అన్నారు. అయినా పీఆర్వోగా పనిచేసిన వ్యక్తి అంతటితోనే ఆగిపోవాల్సిందేనా..? రాజకీయాల్లో ఎదగకూడదా..? అని ప్రశ్నించారు. పవన్‌కు మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉండటం వల్లనే జనసేన పార్టీ ఓడిపోవడానికి కారణమని పేర్కొన్నారు నటుడు పృధ్వీరాజ్.