వెబ్ సిరీస్‌ల్లో నటించేందుకు మెగాస్టార్ సై

మెగాస్టార్ చిరంజీవి.. వెండితెరపైనే కాకుండా వెబ్ సరీస్‌ల్లోనూ నటించేందుకు సిద్ధమవుతున్నారు. అవును వీరు విన్నది నిజమే. లాక్‌డౌన్ వల్ల ఇంటిపట్టునే ఉన్న ఆయన ఇటీవలే..

వెబ్ సిరీస్‌ల్లో నటించేందుకు మెగాస్టార్ సై
Follow us

| Edited By:

Updated on: Apr 22, 2020 | 4:42 PM

మెగాస్టార్ చిరంజీవి.. వెండితెరపైనే కాకుండా వెబ్ సరీస్‌ల్లోనూ నటించేందుకు రెడీ అన్నారు. అవును వీరు విన్నది నిజమే. లాక్‌డౌన్ వల్ల ఇంటిపట్టునే ఉన్న ఆయన ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అవకాశమొస్తే ఖచ్చితంగా వెబ్ సిరీస్‌లో నటిస్తానని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం మాత్రం వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నానని తెలిపారు.

కాగా టాలీవుడ్‌లో చాలా మంది నటులు ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు. ఇప్పటికే సమంత ఈ బాటలోనే నడుస్తోంది. ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’లో కీలక పాత్ర పోషించింది. త్వరలో ఈ సీజన్, ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ ‘ఆచార్య’లో నటిస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. ఇందులో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో రామ్ చరణ్.. ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడనే వార్త అభిమానుల్లో అంచనాల్ని పెంచుతోంది.

Read More: 

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

ట్రాన్స్‌జెండర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. అన్ని అప్లికేషన్స్‌లోనూ..