ఐపీఎల్‌తో ధోని కెరీర్ ముగిసినట్లేనా.?

జట్టులో అతడొక మాస్టర్ మైండ్.. వికెట్ల వెనుక ఉంటూ బ్యాట్స్‌మెన్‌ను చాకచక్యంగా స్టంపింగ్ చేయడమే కాకుండా బౌలర్లకు కావాల్సిన సలహాలిస్తూ సరైన సమయంలో వికెట్లు పడేలా ప్రణాళికలు రచిస్తాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా.. విజయానికి దగ్గరగా ఉన్నా.. అతడు ఎంతో కూల్‌గా ఉంటూ చిరునవ్వు చిందిస్తాడు. మీకు ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది.. ఎవరి గురించి చెబుతున్నానోనని.. అదేనండీ మన మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని. సౌరవ్ గంగూలీ అనంతరం టీమిండియా పగ్గాలు చేపట్టిన ధోని ఎన్నో […]

ఐపీఎల్‌తో ధోని కెరీర్ ముగిసినట్లేనా.?
Follow us

|

Updated on: Dec 31, 2019 | 12:15 PM

జట్టులో అతడొక మాస్టర్ మైండ్.. వికెట్ల వెనుక ఉంటూ బ్యాట్స్‌మెన్‌ను చాకచక్యంగా స్టంపింగ్ చేయడమే కాకుండా బౌలర్లకు కావాల్సిన సలహాలిస్తూ సరైన సమయంలో వికెట్లు పడేలా ప్రణాళికలు రచిస్తాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా.. విజయానికి దగ్గరగా ఉన్నా.. అతడు ఎంతో కూల్‌గా ఉంటూ చిరునవ్వు చిందిస్తాడు. మీకు ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది.. ఎవరి గురించి చెబుతున్నానోనని.. అదేనండీ మన మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని.

సౌరవ్ గంగూలీ అనంతరం టీమిండియా పగ్గాలు చేపట్టిన ధోని ఎన్నో అద్భుత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ప్రపంచమేటి బ్యాట్స్‌మెన్‌గా అవతరించడంలో ధోని పాత్ర ఎంతైనా ఉంది. ఒక్క కోహ్లీ మాత్రమే కాదు.. బౌలర్లకు దిశానిర్దేశాలు ఇవ్వడంలో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా విజయతీరాలు చేర్చడంలో ధోని దిట్ట. అలాంటి మహేంద్రుడు కొద్దికాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు.

వన్డే వరల్డ్ కప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా ధోని.. ఎప్పుడు రీ- ఎంట్రీ ఇస్తాడన్న దానిపై క్లారిటీ లేదు. ప్రపంచకప్‌లో టాప్ ఆర్డర్ విఫలమైనా.. ధోని చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. అయితే అనూహ్యంగా రనౌట్ కావడంతో భారత్ మెగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇక ఆ తర్వాత రెండు నెలలు ఆర్మీలో సేవ చేసిన ధోని.. తాజాగా జరిగిన వెస్టిండీస్ సిరీస్, త్వరలో జరగబోయే శ్రీలంక సిరీస్‌లకు ఎంపిక కాలేదు.

అతడి రిటైర్మెంట్‌పై ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నా.. అభిమానులకు మాత్రం ఆయన తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తాడన్న ఆశ మాత్రం ఉంది. తాజాగా ధోని కూడా ఓ ఇంటర్వ్యూలో జనవరి వరకు తాను ఏం చెప్పలేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

త్వరలో జరగబోయే ఐపీఎల్‌లో ధోని ఫామ్‌ను బట్టి అతడు జట్టుతో కొనసాగుతాడా.. లేదా అనే దానిపై అటు బీసీసీఐ, ఇటు సెలెక్టర్లు తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్‌లో ఆస్ట్రేలియాలో మొదలయ్యే టీ20 వరల్డ్‌కప్‌కు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను సిద్ధం చేస్తోందని సమాచారం.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..