చైనాలో కరోనా సెకండ్ వేవ్ ! కోటి మంది లాక్ డౌన్ లో !
చైనాలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తలెత్తుతోంది. రాజధాని బీజింగ్ లో ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న జిమ్స్ , స్విమ్మింగ్ పూల్స్ ని మళ్ళీ మూసివేశారు. రష్యా సమీపంలోని షాంక్సీ ప్రావిన్స్ లో లాక్ డౌన్ విధించారు. ఈ రాష్ట్రంలో సుమారు కోటిమందికి పైగా జనాభా ఉన్నారు.
చైనాలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తలెత్తుతోంది. రాజధాని బీజింగ్ లో ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న జిమ్స్ , స్విమ్మింగ్ పూల్స్ ని మళ్ళీ మూసివేశారు. రష్యా సమీపంలోని షాంక్సీ ప్రావిన్స్ లో లాక్ డౌన్ విధించారు. ఈ రాష్ట్రంలో సుమారు కోటిమందికి పైగా జనాభా ఉన్నారు. రష్యా నుంచి తిరిగి వఛ్చిన చైనీయుల కారణంగా ఏడు కొత్త ఇంపోర్టెడ్ కేసులు నమోదైనట్టు గుర్తించారు. దేశంలో ఎకానమీని పునరుధ్ధరించేందుకు, తమ ఇమేజ్ పవర్ ని ప్రపంచ దేశాలకు చాటేందుకు ప్రయత్నిస్తున్న అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కి ఇది ఊహించని దెబ్బే. తమ దేశంలో కన్ఫామ్ అయిన కరోనా కేసులు 82,816 అని, 4,632 మంది కరోనా రోగులు మృతి చెందారని చైనా చెబుతున్నప్పటికీ, ఇది పాత లెక్కలేనని, తాజా పరిస్థితికి సంబంధించి ఏ మాత్రం నమ్మదగినదిగా లేదని ప్రపంచ దేశాల నేతలు కొట్టిపారేస్తున్నారు. ఆ దేశం కావాలనే కరోనా వైరస్ ని వ్యాపింపజేస్తోందని వారు ఇప్పటికీ భావిస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న తమ దేశీయులను తప్పనిసరిగా క్వారంటైన్ కి వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ఆదేశిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో సంబంధిత కార్యక్రమాలకు వెళ్లేవారు ప్రభుత్వం ఆమోదించిన హెల్త్ యాప్ ని వినియోగించుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. పెళ్లిళ్లు, కాన్ఫరెన్సులు, ఇతర కార్యక్రమాలను నిషేధించారు. అయినా ఇన్ని చర్యలు తీసుకుంటున్నా.. ‘రెండో తరం’ కరోనా కేసులు తలెత్తడం చైనాను భయాందోళనకు గురి చేస్తోంది.