కరోనా వైరస్ భయం…. ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి ఆత్మహత్య
ఢిల్లీలో 56 ఏళ్ళ ఐఆర్ఎస్ అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. తనవల్ల తన కుటుంబానికి కూడా ఈ వైరస్ సోకవచ్చునని భయపడిన అయన.. తన కారులోనే యాసిడ్ వంటి లిక్విడ్ తాగారు.
ఢిల్లీలో 56 ఏళ్ళ ఐఆర్ఎస్ అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. తనవల్ల తన కుటుంబానికి కూడా ఈ వైరస్ సోకవచ్చునని భయపడిన అయన.. తన కారులోనే యాసిడ్ వంటి లిక్విడ్ తాగారు. వారం రోజులక్రితమే ఈయన కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా రిపోర్టులో నెగెటివ్ అని వచ్చింది. అయితే తన కారణంగా తన కుటుంబ సభ్యులెవరూ ఈ వైరస్ తో బాధ పడరాదని భావించి ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఆయన కారులో పోలీసులకు ఈ మేరకు సూసైడ్ నోట్ లభించింది. ద్వారకా సౌత్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.. ఓ కారులో ఎవరో వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఈయనను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు.