Breaking: అస్వస్థతకు గురైన ఇర్ఫాన్.. ఐసీయూలో చికిత్స..!
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్లుండి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ముంబయిలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి ఇర్ఫాన్ తరలించారు.
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్లుండి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ముంబయిలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి ఇర్ఫాన్ తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ విషయంపై ఇర్ఫాన్ సన్నిహిత వర్గాలు ఓ ప్రకటనను ఇచ్చారు. పెద్దప్రేగు సంబంధిత వ్యాధితో ఇర్ఫాన్ బాధపడుతున్నారని వారు తెలిపారు. ఆయనకు చికిత్స జరుగుతుందని.. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
కాగా 2018లో న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ అనే అరుదైన క్యాన్సర్ వ్యాధి తనకు సోకినట్లు ఇర్ఫాన్ ఖాన్ ప్రకటించారు. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లి చికిత్స కూడా తీసుకున్నారు. కానీ పూర్తిగా కోలుకోలేదు. భారత్కు తిరిగి వచ్చిన తరువాత ఆ మధ్యన మరోసారి తన ఆరోగ్యంపై స్పందించారు ఇర్ఫాన్. తాను పూర్తిగా కోలుకోలేదని ఆయన వివరించారు. ఇక ఇక్కడే ఉంటూ రెగ్యులర్ చెకప్ చేయించుకుంటున్నారు. కాగా ఇటీవల ఇర్ఫాన్ తల్లి సయీద బేగం వృద్ధాప్య కారణాలతో కన్నుమూశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆమె అంత్యక్రియలకు ఇర్ఫాన్ హాజరుకాలేకపోగా.. వీడియో కాల్లో తల్లి అంత్యక్రియలను నటుడు చూసిన విషయం తెలిసిందే.
Read this Story Also: భారత్లో ఆ వృద్ధుడు గుర్తుపట్టాక కన్నీళ్లు వచ్చాయి: ‘టైటానిక్’ హీరోయిన్