ఇరాక్ మళ్ళీ రక్తసిక్తం.. ఆందోళనల్లో 40 మందిమృతి.. అవినీతిపై ఎలుగెత్తిన యువత

ఇరాక్ మళ్ళీ రక్తసిక్తమైంది. రాజధాని బాగ్దాద్ నిరసనకారుల ఆందోళనతో అట్టుడికింది. పెద్దఎత్తున జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో వేలాదిమంది పాల్గొన్నారు. శుక్రవారం బాగ్దాద్ లోని తహరీర్ స్క్వేర్ (గ్రీన్ జోన్) ప్రాంతానికి చేరుకున్న ఆందోళనకారులను అడ్డుకునేందుకు సాయుధ దళాలు రబ్బరు బులెట్లను, బాష్పవాయువును ప్రయోగించాయి. ఈ ఘర్షణల్లో 40 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. (ఈ జోన్ లో అనేక ప్రభుత్వ కార్యాలయాలు, విదేశీ ఎంబసీలు ఉన్నాయి). తమకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలని, ప్రజా సేవలు […]

ఇరాక్ మళ్ళీ రక్తసిక్తం.. ఆందోళనల్లో 40 మందిమృతి.. అవినీతిపై ఎలుగెత్తిన యువత
Follow us

|

Updated on: Oct 26, 2019 | 1:20 PM

ఇరాక్ మళ్ళీ రక్తసిక్తమైంది. రాజధాని బాగ్దాద్ నిరసనకారుల ఆందోళనతో అట్టుడికింది. పెద్దఎత్తున జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో వేలాదిమంది పాల్గొన్నారు. శుక్రవారం బాగ్దాద్ లోని తహరీర్ స్క్వేర్ (గ్రీన్ జోన్) ప్రాంతానికి చేరుకున్న ఆందోళనకారులను అడ్డుకునేందుకు సాయుధ దళాలు రబ్బరు బులెట్లను, బాష్పవాయువును ప్రయోగించాయి. ఈ ఘర్షణల్లో 40 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. (ఈ జోన్ లో అనేక ప్రభుత్వ కార్యాలయాలు, విదేశీ ఎంబసీలు ఉన్నాయి). తమకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలని, ప్రజా సేవలు మెరుగుపరచాలని, అవినీతిని అంతమొందించాలని ముఖ్యంగా యువకులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన అల్లర్లలో సుమారు 2 వేల మంది గాయపడ్డారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బాగ్దాద్ నగరంలోని దివానియా పట్టణంలో పారామిలిటరీ కార్యాలయానికి నిప్పు పెట్టేందుకు వఛ్చిన నిరసనకారులను చెదరగొట్టేందుకు సైనికులు మొదట లాఠీచార్జి చేసి బాష్ప వాయువు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో 12 మంది మరణించారు ఆందోళనకారుల దాడుల్లో . భద్రతా దళాల్లోనూ కొందరు గాయపడ్డారు. ధీకార్ ప్రావిన్స్ లో ఓ ప్రభుత్వ కార్యాలయంలోనికి చొచ్ఛుకుపోయేందుకు దాదాపు మూడు వేలమంది ప్రయత్నించారు. ముతన్నా ప్రావిన్స్ లో షియా పొలిటికల్ కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వీరిలో చాలామంది ఇరాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ప్రధాని అదిల్ అబ్దుల్ మెహరీ హెచ్చరించారు.అవినీతిని అదుపు చేసేందుకు యత్నిస్తామని, యువతకు ఉద్యోగావకాశాలుకల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ హామీలను యువకులు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ నెలారంభంలో జరిగిన నిరసన ప్రదర్శనల్లో హింస పెల్లుబికి 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత సంవత్సరమే ప్రధాని పదవిలోకి వఛ్చిన మెహరీ.. దేశ ప్రయోజనాల పరిరక్షణకు తనకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఆయన మాటలను ‘ గాలికబుర్లు ‘గా ఆందోళనకారులు కొట్టిపారేస్తున్నారు. ఇరాన్ పట్ల మెతక వైఖరి ఎందుకన్నదే వీరి ప్రశ్న.మరోవైపు ఇరాక్ లోని తాజా పరిణామాలను అమెరికా నిశితంగా గమనిస్తోంది. ఇప్పుడిప్పుడే సిరియా-టర్కీ మధ్య సైనిక చర్యను నివారించడంలో సఫలమైన ‘ పెద్దన్న ‘.. ట్రంప్.. వైట్ హౌస్ లో ఇరాక్ ‘ ఘర్షణల ‘ పై చర్చించినట్టు సమాచారం.

గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..