మమతా బెనర్జీ కాళ్లు మొక్కిన ఐజీ..వైరల్ అవుతోన్న వీడియో
పోలీస్ ఐజీ రాజీవ్ మిశ్రా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాళ్లు మెుక్కడం వివాదాస్పదమైంది. ఇటీవల ఓ ప్రభుత్వ కార్యక్రమం కోసం మమతా పశ్చిమ మిద్నాపుర్ జిల్లాను సందర్శించారు. ఆ సమయంలో ఈ ఘటన చోటుచోసుకుంది. 8 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో బీచ్ పక్కన కుర్చీపై కూర్చున్న మమత.. అక్కడున్న వారికి కేకు తినిపించారు. ఈ క్రమంలో ఐజీ రాజీవ్ వంతు వచ్చింది. కేక్ తిన్న రాజీవ్ మమత పాదాలకు నమస్కరించారు. ఈ సన్నివేశానికి […]
పోలీస్ ఐజీ రాజీవ్ మిశ్రా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాళ్లు మెుక్కడం వివాదాస్పదమైంది. ఇటీవల ఓ ప్రభుత్వ కార్యక్రమం కోసం మమతా పశ్చిమ మిద్నాపుర్ జిల్లాను సందర్శించారు. ఆ సమయంలో ఈ ఘటన చోటుచోసుకుంది. 8 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో బీచ్ పక్కన కుర్చీపై కూర్చున్న మమత.. అక్కడున్న వారికి కేకు తినిపించారు. ఈ క్రమంలో ఐజీ రాజీవ్ వంతు వచ్చింది. కేక్ తిన్న రాజీవ్ మమత పాదాలకు నమస్కరించారు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. డ్యూటిలో ఉన్న ఓ పోలీస్ అధికారి సీఎం కాళ్లకు నమస్కరించడమేంటని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన ఆగస్టు 21న జరిగినట్లు తెలుస్తోంది.
What is happening? On duty police officer touches feet of CM, this is shameful for uniform of police as well as Office of Chief Minister.#shame #mamatabanerjee #bengal pic.twitter.com/pf3aQRnEOi
— Arjun Singh (@ArjunsinghWB) August 28, 2019