గేల్ ట్వీట్తో కంగారుపడ్డ అభిమానులు
సెలెబ్రిటీల ట్వీట్లతో పెద్ద చిక్కే వచ్చిపడుతుంది.. ట్వీట్ను పూర్తిగా అర్థం చేసుకునేలోపే పెద్ద హడావుడి జరుగుతోంది..
సెలెబ్రిటీల ట్వీట్లతో పెద్ద చిక్కే వచ్చిపడుతుంది.. ట్వీట్ను పూర్తిగా అర్థం చేసుకునేలోపే పెద్ద హడావుడి జరుగుతోంది.. నిన్న బ్యాడ్మింటన్ క్రీడాకారణి పీవీ సిందు ఇచ్చిన ట్వీట్ ఎంత గందరగోళం సృష్టించిందో తెలిసిందే కదా! ఇలా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కూడా తన ట్వీట్లో కాసింత గందరగోళం కాసింత అయోమయం కలిగించాడు.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతున్న ఐపీల్ టోర్నీలో పంజాబ్ ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే కదా! టోర్నీలో ఉండాలంటే తప్పనిసరిగా గెవాల్సిన ఆ మ్యాచ్లో చెన్నై చేతిలో ఓటమిపాలయ్యింది.. ఆ టీమ్ మెంబర్ అయిన గేల్ నిన్న ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు.. ఆ ట్వీట్ అభిమానులకు అయోమయం కలిగించింది. ‘ నా సీజన్ ముగిసినా, మీరంతా ఈ ఐపీఎల్ టోర్నీలో చూస్తూ తరించండి’ అంటూ థాంక్స్తో ట్వీట్ ముగించాడు గేల్.. అసలు గేల్ ఏం చెప్పదల్చుకున్నాడో ఫ్యాన్స్కు అర్థం కాలేదు.. క్రిస్ గేల్ రిటైరవుతున్నారేమోనని కంగారుపడ్డారు. మీరు క్రికెట్ నుంచి తప్పుకోకుండి.. ఇంకొన్ని సీజన్లు ఆడాలి.. మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి.. ప్లీజ్ మీరు మాత్రం రిటైర్ కావద్దు అంటూ రీ ట్వీట్లు చేయడం మొదలు పెట్టారు. నిజానికి గేల్ ఈ ఐపీఎల్ సీజన్లో కేవలం ఏడు మ్యాచ్లే ఆడాడు.. 288 పరుగులు చేశాడు.. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.. మొన్న రాజస్తాన్పై 99 రన్స్ చేసి ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. క్రిస్ గేల్ను పంజాబ్ టీమ్ మొదటి నుంచి ఆడించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని అంటున్నారు క్రిస్ అభిమానులు.