IPL 2020: తొలి మ్యాచ్లు మిస్ కానున్న స్టార్ ప్లేయర్స్ వీళ్లే.!
ఐపీఎల్ 2020కి రంగం సిద్ధమైంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఈ లీగ్ జరగనుంది. ఇప్పటికే దుబాయ్ చేరుకున్న ఫ్రాంచైజీలు..
IPL 2020: ఐపీఎల్ 2020కి రంగం సిద్ధమైంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఈ లీగ్ జరగనుంది. ఇప్పటికే దుబాయ్ చేరుకున్న ఫ్రాంచైజీలు.. క్వారంటైన్ ముగించుకుని ప్రాక్టీస్ కూడా షురూ చేశాయి. ఇదిలా ఉంటే ఐపీఎల్ తొలి మ్యాచ్లకు పలువురు స్టార్ ప్లేయర్స్ దూరం కానున్నారు. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్ ఇందుకు కారణం. ఈ సిరీస్ సెప్టెంబర్ 16తో పూర్తి కానుండగా.. ఆ తర్వాత ఈ ఆటగాళ్లు యూఏఈ బయల్దేరిన బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆయా ప్లేయర్స్ కరోనా టెస్టులు పూర్తి చేసుకుని వారం రోజులు క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్లకు దూరం కానున్న ఈ ప్లేయర్స్ ఎవరో ఫ్రాంచైజీల వారీగా ఒకసారి చూద్దాం..
- చెన్నై సూపర్ కింగ్స్: హాజిల్వుడ్, సామ్ కుర్రాన్
- కోల్కతా నైట్ రైడర్స్: పాట్ కమ్మిన్స్, మోర్గాన్, టామ్ బాంటన్
- సన్రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో, మిచెల్ మార్ష్
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: మొయిన్ అలీ, ఆరోన్ ఫించ్, ఫిలిప్
- ఢిల్లీ క్యాపిటల్స్: అలెక్స్ కారీ, మార్కస్ స్టోయినిస్, క్రిస్ వోక్స్
- రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, ఆండ్రూ టై, టామ్ కుర్రాన్
- కింగ్స్ ఎలెవన్ పంజాబ్: గ్లెన్ మాక్స్ వెల్
Also Read:
విశాఖను భయపెడుతున్న కొత్త వైరస్.. జనాల్లో హడల్..
‘మనసు మమత’ శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..
తెలంగాణ సర్కార్ సంచలనం.. ఇకపై ‘లైఫ్టైమ్ క్యాస్ట్ సర్టిఫికెట్’..