IPL 2020: క్రికెటర్లకు షాకిచ్చిన బీసీసీఐ..!

ఐపీఎల్‌లో ఆడనున్న క్రికెటర్లకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీని సగానికి సగం తగ్గించేసింది. ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

IPL 2020: క్రికెటర్లకు షాకిచ్చిన బీసీసీఐ..!
Follow us

| Edited By:

Updated on: Mar 04, 2020 | 3:53 PM

ఐపీఎల్‌లో ఆడనున్న క్రికెటర్లకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీని సగానికి సగం తగ్గించేసింది. ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విజేతకు రూ.10కోట్ల ప్రైజ్ మనీ అందించనున్నారు. గతంలో ఈ అమౌంట్ రూ.20కోట్లు ఉండేది. అలాగే రన్నరప్‌కు గతంలో రూ.12.5కోట్ల ప్రైజ్ మనీ ఉండగా.. ఈ ఏడాది రూ.6.25కోట్లు అందించనున్నారు. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లకు ఒక్కొక్కరికి రూ.4.375కోట్లు ఇవ్వనున్నారు.

అన్ని ఫ్రాంచైజీలు మంచి వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. వారి ఆదాయాన్ని పెంచడం కోసం స్పాన్సర్‌షిప్ లాంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందుకే ప్రైజ్ మనీపై ఈ నిర్ణయం తీసుకున్నాం అని బీసీసీఐకు చెందిన ఓ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది మార్చి 29నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్.. మే 24న ముగియనున్న విషయం తెలిసిందే.