సన్రైజర్స్కు గట్టి షాక్.. టోర్నీ నుంచి మార్ష్ ఔట్.!
ఐపీఎల్ 2020 ఆరంభంలోనే సన్రైజర్స్ హైదరాబాద్కు గట్టి షాక్ తగిలింది. నిన్న జరిగిన బెంగళూరు మ్యాచ్లో గాయపడిన మిచెల్ మార్ష్.. టోర్నీ నుంచి వైదొలిగే పరిస్థితి కనిపిస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2020 ఆరంభంలోనే సన్రైజర్స్ హైదరాబాద్కు గట్టి షాక్ తగిలింది. నిన్న జరిగిన బెంగళూరు మ్యాచ్లో గాయపడిన మిచెల్ మార్ష్.. టోర్నీ నుంచి వైదొలిగే పరిస్థితి కనిపిస్తున్నట్లు సమాచారం. అతడి గాయం తీవ్రమైందని… కొద్ది నెలల పాటు విశ్రాంతి ఖచ్చితంగా అవసరమని.. మిగతా మ్యాచ్లు కూడా ఆడే అవకాశం లేదని జట్టు వర్గాలు పీటీఐకి తెలిపాయి. (IPL 2020)
నిన్న బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో మిచెల్ మార్ష్.. ఐదో ఓవర్ వేస్తుండగా పిచ్పై జారిపడి గాయపడ్డాడు. తన ఓవర్ను పూర్తి చేద్దామని అనుకున్నా.. కాలినొప్పి ఎక్కువ కావడంతో మైదానం వీడాడు. ఇక లక్ష్య చేధనలో జట్టుకు తన అవసరం ఉందని.. కాలిపై భారం వేసే పరిస్థితి లేనప్పటికీ బ్యాటింగ్కు దిగి క్రీడా స్పూర్తిని చాటుకున్న సంగతి తెలిసిందే. కాగా, మార్ష్ గాయంపై ఇంకా సన్రైజర్స్ జట్టు అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ టోర్నీ నుంచి మార్ష్ దూరమైతే మాత్రం.. అతడి స్థానంలో డాన్ క్రిస్టియన్ను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఢిల్లీ ఖాతాలో అరుదైన రికార్డు..
A true warrior! ?#OrangeArmy #SRH #Dream11IPL pic.twitter.com/IfLLwYHXWT
— SunRisers Hyderabad (@SunRisers) September 22, 2020