ముంబై బ్యాట్స్మెన్ల చితక్కొట్టుడు.. హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 209 పరుగుల భారీ టార్గెట్ను నిర్దేశించింది.
ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 209 పరుగుల భారీ టార్గెట్ను నిర్దేశించింది. డికాక్(67; 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు), ఇషాన్ కిషన్(31; 23 బంతుల్లో 1ఫోర్, 2 సిక్స్లు), హార్దిక్ పాండ్యా( 28; 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు), పొలార్డ్( 25; 13 బంతుల్లో 0 ఫోర్లు, 3 సిక్స్లు), కృనాల్ పాండ్యా( 20 నాటౌట్; 4 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) మెరపులు మెరిపించడంతో ముంబై భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. (IPL 2020)
ముంబై ఇన్నింగ్స్ ప్రారంభంలో రోహిత్ శర్మ త్వరగా పెలివియన్కు చేరిపోయినా.. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. డికాక్, సూర్యకుమార్ యాదవ్ రెండో వికెట్కు 46 పరుగులు చేశారు. ఆ తరుణంలో ఇషాన్ కిషన్కు క్వింటన్ డికాక్తో జత కలిశాడు. ఈ జోడి 78 పరుగులు జత చేసిన తర్వాత డికాక్ మూడో వికెట్గా ఔటయ్యాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ కూడా త్వరగా ఔటైనా.. చివర్లో హార్దిక్, పొలార్డ్, కృనాల్ పాండ్యాలు ముంబై స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీనితో ముంబై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.