ఐపీఎల్ 2020: తొలి మ్యాచ్ చెన్నై వెర్సస్ ముంబై..!
ఐపీఎల్ 2020 మరో రెండు వారాల్లో మొదలు కానుంది. మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ రేపు విడుదల కానున్న నేపధ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
IPL 2020: ఐపీఎల్ 2020 మరో రెండు వారాల్లో మొదలు కానుంది. మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ రేపు విడుదల కానున్న నేపధ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎప్పటిలానే గతేడాది ఫైనల్కు చేరిన జట్లతోనే ప్రతీ ఏటా టోర్నీ ప్రారంభమవుతుంది. ఇదే ఆనవాయితీగా వస్తోంది. దీని ప్రకారమే ఈ ఏడాది మొదటి మ్యాచ్లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొద్దిరోజుల క్రితం చెన్నై జట్టులోని పలువురు ఆటగాళ్లు, స్టాఫ్కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగదని పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఇప్పుడు చెన్నై జట్టు సభ్యులందరికీ కరోనా నెగటివ్ రావడమే కాకుండా ఆ టీమ్ ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా షూరూ చేయడంతో.. మొదటి మ్యాచ్ అనుకున్న ప్రకారం ముంబై, చెన్నై మధ్య జరగనుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఐపీఎల్ నిర్వాహకులు మాత్రం శనివారం తమ ట్విట్టర్లో పెట్టిన పోస్టర్ మరో చర్చకు దారి తీస్తోంది. ‘డ్రీమ్ 11 ఐపీఎల్కు ఇంకా 14 రోజులే మిగిలి ఉంది. ఆగలేకపోతున్నాం’ అని పేర్కొంటూ అర్సీబీ, కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్ల ఫోటోలను పంచుకోవడంతో.. ఈ రెండు జట్ల మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగనుందని పలువురు అంటున్నారు. మరి అసలు విషయం తెలియాలంటే మరి కొద్దిగంటలు ఆగాల్సిందే.!
2 weeks until the #Dream11IPL extravaganza! ?
CAN. NOT. WAIT! ⏳ pic.twitter.com/HoDqfQBE1q
— IndianPremierLeague (@IPL) September 5, 2020