ఫర్వాలేదనిపించిన ఢిల్లీ.. మెరిసిన రాయల్స్ బౌలర్లు..
ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 185 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. స్టోయినిస్(39)...
IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 185 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. స్టోయినిస్(39), హెట్మెయిర్(45) రాణించడంతో పాటు లోయర్ ఆర్డర్ చివర్లో మెరపులు మెరిపించడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ ఇన్నింగ్స్ ప్రారంభంలో వరుసగా వికెట్లు పడినా.. స్టోయినిస్, హెట్మెయిర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీనితో ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరో వైపు స్కోర్ బోర్డు ఊపందుకుంది. చివర్లో అక్షర్ పటేల్(16), హర్షల్(17) ఫర్వలేదనిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
Also Read:
మ్యాక్స్వెల్.. ఎక్కడ నీ మ్యాడ్నెస్..!