కిడ్నీ రాకెట్ కేసు: ఆసుపత్రి యాజమాన్యానికి బిగుస్తున్న ఉచ్చు

విశాఖలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరికొందరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు కిడ్నీ రాకెట్ కేసులో త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కమిటీ చేతికి ప్రాథమిక ఆధారాలు లభించగా.. శ్రద్ధ ఆసుపత్రి యాజమాన్యంతో పాటు మరో డాక్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. కాగా విచారణలో తొలిరోజు ఆసుపత్రి యాజమాన్యం అందుబాటులో లేకపోగా.. […]

కిడ్నీ రాకెట్ కేసు: ఆసుపత్రి యాజమాన్యానికి బిగుస్తున్న ఉచ్చు
Follow us

| Edited By:

Updated on: May 14, 2019 | 11:56 AM

విశాఖలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరికొందరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు కిడ్నీ రాకెట్ కేసులో త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కమిటీ చేతికి ప్రాథమిక ఆధారాలు లభించగా.. శ్రద్ధ ఆసుపత్రి యాజమాన్యంతో పాటు మరో డాక్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. కాగా విచారణలో తొలిరోజు ఆసుపత్రి యాజమాన్యం అందుబాటులో లేకపోగా.. వారి తీరుపై విచారణ బృందం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.