జూన్ రెండోవారంలో ఇంటర్ పరీక్ష ఫలితాలు..!
కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఇంటర్మీడియెట్ వాల్యుయేషన్ వేగంగా కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ రెండోవారంలో ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. దీనికోసం వాల్యుయేషన్ ప్రక్రియను ఈ నెలాఖరుతో పూర్తిచేసేలా టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం వాల్యుయేషన్ తో పాటు ఓంఎంఆర్స్కానింగ్ ప్రాసెస్ కూడా ఏకకాలంలో పూర్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10.62 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత నాలుగేళ్లుగా ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల […]
కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఇంటర్మీడియెట్ వాల్యుయేషన్ వేగంగా కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ రెండోవారంలో ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. దీనికోసం వాల్యుయేషన్ ప్రక్రియను ఈ నెలాఖరుతో పూర్తిచేసేలా టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం వాల్యుయేషన్ తో పాటు ఓంఎంఆర్స్కానింగ్ ప్రాసెస్ కూడా ఏకకాలంలో పూర్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10.62 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత నాలుగేళ్లుగా ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల చేస్తున్న ఇంటర్బోర్డు, ఈ ఏడాది తొలుత సెకండియర్ ఫలితాలు విడుదలచేయాలని భావిస్తోంది. లాక్ డౌన్ లో అలస్యంగా మొదలైనప్పటికీ.. ఇంటర్ సెకండియర్ వాల్యుయేషన్ మూడు రోజుల క్రితమే పూర్తయింది. ప్రస్తుతం ఫస్టియర్ఇంగ్లిష్, సంస్కృతం, మ్యాథ్స్వాల్యుయేషన్ కొనసాగుతోంది. మరో మూడు రోజుల్లో ఈ పేపర్లు కూడా పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. రిజల్ట్స్ప్రాసెస్ను వారం, పది రోజుల్లో పూర్తి చేయనున్నారు. గతంలో జరిగిన తప్పులు మరోసారి జరగకుండా జాగ్రతలు తీసుకున్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్.