రెండో పెళ్లి వద్దన్నందుకు ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
పెళ్లైన ఓ యువకుడు మాయమాటలతో ఇంటర్ విద్యార్థిని లొంగదీసుకున్నాడు. బాలికను గర్బవతిని చేసి రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఇందుకు తల్లిదండ్రులు ససేమిరా అనడంతో అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
పెళ్లైన ఓ యువకుడు మాయమాటలతో ఇంటర్ విద్యార్థిని లొంగదీసుకున్నాడు. బాలికను గర్బవతిని చేసి రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఇందుకు తల్లిదండ్రులు ససేమిరా అనడంతో అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లా రొంపిచర్ల పోలీసుస్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన అమీర్ 2వ కుమారై రేష్మా(17) ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. కాగా, అదే ప్రాంతానికి చెందిన ఇమ్రాన్(27)తో పరిచయం ఏర్పడింది. రేష్మాకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. దీంతో ఇద్దరు శారీరకంగా దగ్గరవ్వడంతో ఆమె గర్భం దాల్చింది. ఇమ్రాన్కు ఇది వరకే వివాహమై ఒక కుమారై కూడా ఉంది. విషయం తెలుసుకున్న రేష్మా తల్లిదండ్రులు ఇద్దరినీ మందలించారు.
అయితే, ఇమ్రాన్ తాను రెండో వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. ఇందుకు రేష్మా తల్లిదండ్రులు అంగీకరించలేదు. అతనికి రెండవ భార్యగా వద్దంటూ కుమార్తెకు నచ్చ చెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇంట్లో బెడ్ రూంలో రేష్మా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించి కుటుంబ సభ్యులు హుటాహుటిన రేష్మాను చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.