యూపీలో బాంబు బ్లాస్టులు జరగొచ్చు..ఐబీ వార్నింగ్

ఢిల్లీ: ఉత్తర్‌ ప్రదేశ్‌లో బాంబు పేలుళ్లు జరిగే అవకాశముందని భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరించింది. యూపీలోని చందౌలీ, మిర్జాపూర్‌, సోన్‌భద్రా ప్రాంతాల్లో ఈ పేలుళ్లు జరగొచ్చని పేర్కొంది. దీనిపై నిఘావర్గాలు యూపీ పోలీసులను అప్రమత్తం చేసినట్లు ఏఎన్ఐ న్యూస్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టులు జవాన్ల వాహనంపై బుధవారం పేలుళ్లు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 16 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. గడ్చిరోలి జిల్లాలో భద్రతా […]

యూపీలో బాంబు బ్లాస్టులు జరగొచ్చు..ఐబీ వార్నింగ్
Follow us

|

Updated on: May 03, 2019 | 12:22 PM

ఢిల్లీ: ఉత్తర్‌ ప్రదేశ్‌లో బాంబు పేలుళ్లు జరిగే అవకాశముందని భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరించింది. యూపీలోని చందౌలీ, మిర్జాపూర్‌, సోన్‌భద్రా ప్రాంతాల్లో ఈ పేలుళ్లు జరగొచ్చని పేర్కొంది. దీనిపై నిఘావర్గాలు యూపీ పోలీసులను అప్రమత్తం చేసినట్లు ఏఎన్ఐ న్యూస్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టులు జవాన్ల వాహనంపై బుధవారం పేలుళ్లు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 16 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. గడ్చిరోలి జిల్లాలో భద్రతా సిబ్బందితో వెళ్తున్న ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ ఐఈడీ పేలుళ్లు జరిపారు. ఈ ఘటనలో మరికొంత మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.