దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశం.. ఐబీ హెచ్చరిక
ఓ వైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతుంటే.. మరోవైపు ఉగ్రవాదులు ఇదే అదనుగా దాడులకు ప్లాన్లు వేస్తున్నారు. గత కొన్నేళ్లుగా దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నా.. ఎప్పటికప్పుడు మన సైన్యం వారి వ్యూహాలకు చెక్ పెట్టింది. అయితే దాదపు పది రోజుల నుంచి దేశం కరోనా మహమ్మారితో పెద్ద సవాల్ను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇదే అదనుగా […]
ఓ వైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతుంటే.. మరోవైపు ఉగ్రవాదులు ఇదే అదనుగా దాడులకు ప్లాన్లు వేస్తున్నారు. గత కొన్నేళ్లుగా దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నా.. ఎప్పటికప్పుడు మన సైన్యం వారి వ్యూహాలకు చెక్ పెట్టింది.
అయితే దాదపు పది రోజుల నుంచి దేశం కరోనా మహమ్మారితో పెద్ద సవాల్ను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇదే అదనుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఉగ్రదాడులకు స్కెచ్ వేశారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆదివారం హెచ్చరికలు జారీ చేశాయి. జమ్మూకశ్మీర్ షోపియాన్ ప్రాంతంలోని రహస్య శిబిరంలో దాక్కున్నఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులు.. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నట్లు ఐబీ తెలిపింది. వారు టెలిగ్రాం ద్వారా రహస్య మంతనాలు సాగించారని.. లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీతోపాటు పంజాబ్, యూపీ సరిహద్దుల్లో పోలీస్ సెక్యూరిటీ పెంచాలంటూ ఐబీ హెచ్చరించింది.