భారత్తో టీ20 సిరీస్.. విండీస్కు షాక్!
ఫ్లోరిడా: భారత్తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందే.. విండీస్కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ గాయం కారణంగా అమెరికాలో జరగనున్న మొదటి రెండు టీ20 మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఇంగ్లాండ్లో జరుగుతున్న ప్రపంచకప్ సమయంలోనే రసెల్ గాయం బారిన పడిన సంగతి తెలిసిందే. కానీ అతనికి టీమిండియాతో టీ20 సిరీస్కు జట్టులో చోటు లభించింది. కాగా ఆ గాయం ఇంకా తగ్గకపోవడంతో రసెల్ తప్పుకున్నట్లు తెలిసింది. అతని స్థానంలో జేసన్ […]
ఫ్లోరిడా: భారత్తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందే.. విండీస్కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ గాయం కారణంగా అమెరికాలో జరగనున్న మొదటి రెండు టీ20 మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఇంగ్లాండ్లో జరుగుతున్న ప్రపంచకప్ సమయంలోనే రసెల్ గాయం బారిన పడిన సంగతి తెలిసిందే. కానీ అతనికి టీమిండియాతో టీ20 సిరీస్కు జట్టులో చోటు లభించింది. కాగా ఆ గాయం ఇంకా తగ్గకపోవడంతో రసెల్ తప్పుకున్నట్లు తెలిసింది. అతని స్థానంలో జేసన్ మహ్మద్ బరిలోకి దిగుతాడని కోచ్ ఫ్లాయిడ్ తెలిపాడు. కాగా ఫ్లోరిడా వేదికగా 3, 4 తేదీల్లో తొలి రెండు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. మూడో మ్యాచ్ గయానా వేదికగా ఆరో తేదీన జరగనుంది.
? BREAKING: SQUAD UPDATE! ? Jason Mohammed replaces Andre Russell in West Indies v India T20I Squad
Details below! ⬇️ ⬇️ ⬇️ ⬇️ ⬇️ https://t.co/rD946w6Axx
— Windies Cricket (@windiescricket) August 2, 2019