లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల్లో ముగిసింది. దీంతో నాలుగు రోజుల నష్టాలకు బ్రేకులు పడ్డాయి. సెన్సెక్స్ 86 పాయింట్ల లాభంతో 39,046 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 11,691 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఫార్మా షేర్లపై ఒత్తిడి నెలకొంది. ఆటో రంగ షేర్లు కూడా నష్టపోతూనే వస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు జరిగాయి. అయితే ఐటీ షేర్లు మాత్రం లాభపడ్డాయి. బ్యాంకు షేర్లలోనూ కొనుగోళ్లను గమనించొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ (ముడి […]
స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల్లో ముగిసింది. దీంతో నాలుగు రోజుల నష్టాలకు బ్రేకులు పడ్డాయి. సెన్సెక్స్ 86 పాయింట్ల లాభంతో 39,046 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 11,691 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఫార్మా షేర్లపై ఒత్తిడి నెలకొంది. ఆటో రంగ షేర్లు కూడా నష్టపోతూనే వస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు జరిగాయి. అయితే ఐటీ షేర్లు మాత్రం లాభపడ్డాయి. బ్యాంకు షేర్లలోనూ కొనుగోళ్లను గమనించొచ్చు.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 0.64 శాతం తగ్గుదలతో 60.56 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్కు 0.38 శాతం తగ్గుదలతో 51.97 డాలర్లకు దిగొచ్చింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 24 పైసలు పెరుగుదలతో 69.66 వద్ద ఉంది.