పొరుగుదేశాల సేవలో.. భారత నావికాదళం, వైద్య బృందాలు..!
కోవిద్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలకు సహాయపడేందుకు భారత దేశం సిద్ధంగా ఉంది. అవసరమైతే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 6 నావికా
కోవిద్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలకు సహాయపడేందుకు భారత దేశం సిద్ధంగా ఉంది. అవసరమైతే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 6 నావికా దళ నౌకలు, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచింది. మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో కరోనా వైరస్ నిరోధక చర్యల్లో పాల్గొనేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. 6 నావికా దళ నౌకలు, వైద్య బృందాలు, మానవతావాద సహాయం, విపత్తు సహాయక కిట్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ నౌకలు, సామగ్రి, సిబ్బంది విశాఖపట్నం, కొచ్చి, ముంబైలలో ఉన్నాయని పేర్కొంది.
కాగా.. అత్యవసర సరఫరాలను రవాణా చేసేందుకు భారత వాయు సేనకు చెందిన 28 ఫిక్స్డ్ వింగ్ విమానాలు, 21 హెలికాప్టర్లు భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు దాదాపు 60 టన్నుల అత్యవసర వస్తువులు, మందులు, వైద్య పరికరాల రవాణా కోసం భారత వాయు సేన విమానాలను వినియోగించారు. భారత వాయు సేనకు చెందిన సీ-130జే సూపర్ హెర్క్యులెస్ విమానం 6.2 టన్నుల మందులను మాల్దీవులకు గురువారం తీసుకెళ్లింది. ఆ దేశంలో సొంతంగా టెస్టింగ్, ట్రీట్మెంట్, క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు కోసం సహాయపడేందుకు భారత సైన్యానికి చెందిన వైద్య బృందాన్ని మార్చి 13-21 మధ్య పంపించారు.