కెనడాలో తెలుగు యువకుడి దుర్మరణం

ఉన్నత చదువులు చదివి ఉద్యోగాన్ని సంపాదించాలనే లక్ష్యంతో కెనడా వెళ్లిన ఓ తెలుగు యువకుడు ప్రమాదవశాత్తు అక్కడ నదిలో మునిగి మృత్యువాతపడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం పరిధిలోని దిబ్బలపాలెం సాయినగర్‌కు చెందిన కొల్లి శ్రీనివాసరెడ్డి, మాధవిల కుమారుడు శ్రీనివాస తేజస్వీరెడ్డి(26) దుర్మరణం పాలయ్యాడు,

కెనడాలో తెలుగు యువకుడి దుర్మరణం
Follow us

|

Updated on: Jul 31, 2020 | 4:55 AM

ఉన్నత చదువులు చదివి ఉద్యోగాన్ని సంపాదించాలనే లక్ష్యంతో కెనడా వెళ్లిన ఓ తెలుగు యువకుడు ప్రమాదవశాత్తు అక్కడ నదిలో మునిగి మృత్యువాతపడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం పరిధిలోని దిబ్బలపాలెం సాయినగర్‌కు చెందిన కొల్లి శ్రీనివాసరెడ్డి, మాధవిల కుమారుడు శ్రీనివాస తేజస్వీరెడ్డి(26) 2018లో కెనడా వెళ్లాడు. అక్కడ ఎంఎస్‌ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో బుధవారం స్నేహితులతో కలసి కిచినార్‌ సిటీలోని ఒక నది వద్దకు వెళ్లాడు. స్నేహితులంతా కలసి స్నానం చేస్తున్న సమయంలో తేజస్వీరెడ్డి మిత్రుడు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. స్నేహితుడి ప్రాణాలు కాపాడి తాను మాత్రం నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలిసిన భారత్ లోని తేజస్వీరెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, తమ కుమారుడి మృతదేహాన్ని కెనడా నుంచి స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం కృషీ చేయాలని శ్రీనివాసరెడ్డి, మాధవి దంపతులు వేడుకుంటున్నారు.